E-Paper
Advertisement

విమానయాన సంస్థలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీల్లో 25% తగ్గింపు!

విమానయాన సంస్థలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీల్లో 25% తగ్గింపు!

Airport Fee Reduction: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు.. విమానయాన రంగంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానయాన సంస్థలకు భారీ ఊరటనిస్తూ, విమానాశ్రయాల్లో వసూలు చేసే ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 25 శాతం తగ్గించాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని విమానాశ్రయాలను ఆదేశించింది.

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియాలు ఈ యుద్ధ సెగతో భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరల పెరుగుదల.. విమాన మార్గాల మళ్లింపుతో పెరుగుతున్న ఖర్చుల నుండి ఉపశమనం పొందేందుకు, ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి.

విమానాశ్రయాలు వసూలు చేసే ల్యాండింగ్.. పార్కింగ్ ఛార్జీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, తమపై ఉన్న ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించాలని ఈ సంస్థలు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాయి. పెరిగిన ఇంధన భారాన్ని నేరుగా ప్రయాణికులపై మోపకుండా ఉండేందుకు ఈ రాయితీలు ఎంతో అవసరమని ఎయిర్ ఇండియా, ఇండిగో యాజమాన్యాలు కేంద్రానికి వివరించాయి.

ఇరాన్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో విమాన ఇంధనం (ATF) ధరలు కూడా భారీగా పెరిగాయి. దీనికి తోడు యుద్ధం జరుగుతున్న ప్రాంతాల మీదుగా విమానాలు వెళ్లేందుకు వీల్లేకపోవడంతో, విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన వినియోగం కూడా అధికమవుతోంది. ఈ అదనపు ఆర్థిక ఒత్తిడిని విమానయాన సంస్థలు తట్టుకునేందుకు.. దేశంలోని ప్రభుత్వ.. ప్రైవేట్ విమానాశ్రయాలన్నీ తమ వద్ద ల్యాండ్ అయ్యే దేశీయ విమానాల పార్కింగ్, ల్యాండింగ్ రుసుములలో 25% కోత విధించాలని కేంద్రం ఆదేశించింది.

విమానయాన సంస్థలపై పడే భారాన్ని తగ్గించడం ద్వారా, ఆ భారం ప్రయాణికులపై పడకుండా చూడాలని, విమాన టికెట్ల ధరలు అదుపులో ఉంటాయని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలకు ఈ నిర్ణయం కొంత మేర ఊపిరి పోయనుంది. యుద్ధం వల్ల ఎదురవుతున్న ఈ అసాధారణ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు విమానయాన రంగాన్ని కుప్పకూలకుండా కాపాడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు చక్కబడే వరకు ఈ తగ్గింపు ధరలు అమలులో ఉండే అవకాశం ఉంది.

Read Also: ఆంత్రోపిక్ కొత్త AI మోడల్.. బయటకు వస్తే విధ్వంసమే.. సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం!

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×