Two Helicopters Crash in Malaysia: మలేషియాలో మంగళవారం ఉదయం రెండు హెలికాఫ్టర్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అందులో ఉన్న 10 మంది సిబ్బంది మృతి చెందారు. లూముట్ నేవల్ బేస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
మిలటరీ పరేడ్ కోసం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఆకాశంలో రెండు హెలికాఫ్టర్లు ఢీ కొన్నాయి. వాటి శకలాలు లూముట్ నేవల్ గ్రౌండ్లో పడ్డాయి. భారత కాలమాన ప్రకారం ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాలను లూముట్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి కొంతమంది వ్యక్తులు మేడపై నుంచి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రిహార్సల్స్ కోసం దాదాపు ఏడు నేవీ హెలికాఫ్టర్లు టేకాఫ్ అయ్యాయి. కొద్దిసేపటికే రెండు హెలికాఫ్టర్లు ఒకదానికి మరొకటి ఢీ కొని కుప్పకూలాయి. ఆకాశంలో పెద్ద శబ్దం రావడంతో నేవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. చివరకు వాటి శకలాలు నేవీకి చెందిన పెద్ద మైదానంలో పడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది అక్కడి ప్రభుత్వం.
Also Read: Raisi discuss sharif: మూడురోజుల టూర్, రిలేషన్స్, వాణిజ్యంపై దృష్టి..!
🚨🇲🇾 BREAKING: 2 MILITARY HELICOPTERS CRASH AFTER MID-AIR COLLISION IN MALAYSIA
All 10 people on board were killed.
Source: @BNONews Image: @JatIkhwan pic.twitter.com/fc4VVa3Zda pic.twitter.com/Goh1Wp31wj
— Mario Nawfal (@MarioNawfal) April 23, 2024
Just In :
2 military helicopters crash after mid-air collision in #Malaysia, killing all 10 people on board pic.twitter.com/uKiut8MZ27— Prashant Pandey (@tweet2prashant) April 23, 2024