E-Paper
Advertisement

Sharad Pawar Comments: మీకు క్షమాపణలు చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను: పవార్

Sharad Pawar Comments: మీకు క్షమాపణలు చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను: పవార్
Advertisement

Sharad Pawar Serious On PM Modi(Political news telugu): ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ నేత శరద్ పవార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహా వికాస్ అఘాడీ అభ్యర్థికి మద్దతుగా అమరావతి ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. మాజీ ప్రధానులు కొత్త భారతదేశం కోసం పనిచేశారని, అయితే, ప్రధాని మోదీ మాత్రం ఇతరులను మాత్రమే విమర్శిస్తున్నారని.. గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో చెప్పలేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలే తప్ప ఇతరులపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

అయితే, అమరావతి లోక్ సభ నియోజకవర్గం స్థానంలో కాంగ్రెస్ కు చెందిన బల్వంత్ వాంఖడేపై 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణాను బీజేపీ పోటీకి దింపింది. 2019 ఎన్నికల్లో నవనీత్ రాణాకి మద్దతు ఇచ్చి తాను తప్పు చేశానని, అందుకే అమరావతి ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చానంటూ పవార్ అన్నారు.

Advertisement

ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నరసింహారావు నుంచి మన్మోహన్ సింగ్ వరకు దాదాపు అందరు ప్రధానుల పని తీరును తాను చూశానని.. వారి ప్రయత్నాలు నవ భారతదేశాన్ని రూపొందించడంలో కీలకంగా ఉన్నాయన్నారు. కానీ, ప్రస్తుత ప్రధాని కేవలం విమర్శలు మాత్రమే చేస్తున్నారని పవార్ ఆరోపించారు.

Also Read:చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు: భావోద్వేగంతో తేజస్వీ

Advertisement

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషిని చరిత్రలో ఎవరూ మరిచిపోలేరని, కానీ.. ప్రధాని మోదీ మాత్రం ఆయనను నిరంతరం విమర్శిస్తున్నారని పవార్ అన్నారు. భారతదేశంలో నిరంకుశ పాలనను అనుమతించవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(యుబిటి) గతంలో మాదిరిగానే కాంగ్రెస్ మరియు ఎన్సీపీ తో కలిసి పనిచేయడం ద్వారా జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యతను భుజాన వేసుకుందంటూ పవార్ ప్రశంసించారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×