BigTV English

Earthquake: 24 వేలు దాటిన మరణాలు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు

Earthquake: 24 వేలు దాటిన మరణాలు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు

Earthquake: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈప్రమాదంలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 24 వేల మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


శిథిలాలు కూలిపడి కొందరు మరణిస్తే.. మరికొందరు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఆకలితో అలమటిస్తూ.. తీవ్రమైన చలితో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మృతుల సంఖ్య 30వేలకు చేరుకునే అవకాశం ఉంది.

ఇక శిథిలాల కింద చిక్కుకున్న అద్నాన్ మహమ్మద్ కోర్కుట్ అనే 17 ఏళ్ల యువకుడు 101 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. ఆకలిని, దాహార్తిని తట్టుకోలేక మూత్రం తాగి ప్రాణాలను కాపాడుకున్నాని అద్నాన్ తెలిపాడు.


శిథిలాల కింద చిక్కుకున్న మరో విద్యార్థిని వాట్సాప్ రక్షించింది. ఓ అపార్ట్‌మెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న 20 ఏళ్ల విద్యార్థి సమయ స్పూర్థితో.. వాట్పాప్‌లో తన స్నేహితులకు వీడియో సందేశంతో పాటు తాను ఉన్న లొకేషన్‌ను షేర్ చేశాడు. దీంతో స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారం అందించి… అతడిని సురక్షితంగా కాపాడారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×