BigTV English

Earthquake: 24 వేలు దాటిన మరణాలు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు

Earthquake: 24 వేలు దాటిన మరణాలు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు

Earthquake: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈప్రమాదంలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 24 వేల మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


శిథిలాలు కూలిపడి కొందరు మరణిస్తే.. మరికొందరు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఆకలితో అలమటిస్తూ.. తీవ్రమైన చలితో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మృతుల సంఖ్య 30వేలకు చేరుకునే అవకాశం ఉంది.

ఇక శిథిలాల కింద చిక్కుకున్న అద్నాన్ మహమ్మద్ కోర్కుట్ అనే 17 ఏళ్ల యువకుడు 101 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. ఆకలిని, దాహార్తిని తట్టుకోలేక మూత్రం తాగి ప్రాణాలను కాపాడుకున్నాని అద్నాన్ తెలిపాడు.


శిథిలాల కింద చిక్కుకున్న మరో విద్యార్థిని వాట్సాప్ రక్షించింది. ఓ అపార్ట్‌మెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న 20 ఏళ్ల విద్యార్థి సమయ స్పూర్థితో.. వాట్పాప్‌లో తన స్నేహితులకు వీడియో సందేశంతో పాటు తాను ఉన్న లొకేషన్‌ను షేర్ చేశాడు. దీంతో స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారం అందించి… అతడిని సురక్షితంగా కాపాడారు.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×