E-Paper
Advertisement

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి
Advertisement

Sam Curran Moon Balls:  టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య వన్డే సిరీస్ ఫినిష్ అయింది. లార్డ్స్ వేదికగా ఈ రెండు జట్లు మూడో వన్డే ఆడాయి. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్, మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో 2-1 తేడాతో టీమిండియా పై ఇంగ్లాండ్ మరో సిరీస్ గెలుచుకుంది. అయితే లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమికి ఇంగ్లాండ్ ఆటగాడు సామ్‌ కర్రన్ ( Sam Curran) కీలక పాత్ర పోషించాడు. అతడు వేసిన మూన్ బౌలింగ్ (Sam Curran Moon Balls) బాగా వర్క్ అవుట్ అయింది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా… ఓటమిపాలైంది.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

సామ్‌ కర్రన్ వేసిన మూన్ బాల్స్ ఏంటి ?

Advertisement

ఇంగ్లాండ్ డేంజర్ ఆల్ రౌండర్ సామ్‌ కర్రన్ టీమిండియా పై ఆధిపత్యం ముందు నుంచి ఈ చలాయిస్తున్నాడు. టి20లో అద్భుతంగా రాణించిన సామ్ క‌ర్ర‌న్‌, వన్డేల్లో కూడా అదే ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా మూడవ వన్డేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా చాలా జాగ్రత్తగా ఆడుతున్న సమయంలో.. విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లను తీసి… టీమిండియా ఓటమిని శాసించాడు. అప్పటికే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అందరినీ బరిలోకి దింపి బౌలింగ్ చేయించాడు.

కానీ వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే సామ్ కర్రన్ మూన్ బంతులను (Moon Balls) సందించాడు. ఎక్కువ ఎత్తులో నెమ్మదిగా వచ్చే బంతులే ఈ మూన్ బాల్స్. వీటికి టెంప్ట్ అయిన‌ టీమిండియా క్రికెటర్లు క్యాచ్ లు లేపి.. వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 12 వంతుల్లోనే మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు వికెట్లు టీమ్ ఇండియాకు చాలా కీలకమైనవే. దీంతో టీమ్ ఇండియా కోలుకోలేక… లార్డ్స్ లో గెలిచే మ్యాచ్ పోగొట్టుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ డేంజర్ ఆల్ రౌండర్ సామ్‌ కర్రన్ బౌలింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.

ఇంగ్లాండ్ చేతిలో రెండు సిరీస్ లు కోల్పోయిన టీమిండియా

Advertisement

ఇంగ్లాండ్ చేతిలో టి20 తో పాటు వన్డే సిరీస్ (Team India vs. England) కోల్పోయింది టీమిండియా. మొదట జరిగిన ఐదు టీ20ల సిరీస్ లో టీమిండియాలో వైట్ వాష్ చేసింది ఇంగ్లాండ్. ఇప్పుడు వన్డేలలో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా లార్డ్స్ లో ఇంగ్లాండ్ 27 పరుగులతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తేలిపోయింది టీమిండియా.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×