E-Paper
Advertisement

India Maldives : భారత్‌-మాల్దీవుల వివాదం వేళ.. విదేశాంగ మంత్రుల భేటీ..

India Maldives : భారత్‌-మాల్దీవుల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. విదేశాంగ మంత్రుల మధ్య భేటీ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు లోతుగా చర్చలు జరిపారు. వీటి వివరాలను మంత్రులు తమ ఎక్స్‌ ఖాతాల్లో వెల్లడించారు.

India Maldives : భారత్‌-మాల్దీవుల వివాదం వేళ.. విదేశాంగ మంత్రుల భేటీ..

India Maldives : భారత్‌-మాల్దీవుల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. విదేశాంగ మంత్రుల మధ్య భేటీ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు లోతుగా చర్చలు జరిపారు. వీటి వివరాలను మంత్రులు తమ ట్విట్టర్ (ఎక్స్‌) ఖాతాల్లో వెల్లడించారు.

ఉగాండా రాజధాని కంపాలాలో అలీనోద్యమ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, మాల్దీవుల మంత్రి మూసా జమీర్‌తో భేటీ అయ్యారు. తమ మధ్య ఇరుదేశాల సంబంధాలపై లోతుగా చర్చ జరిగినట్లు జై శంకర్ పేర్కొన్నారు. భారత సైనికుల ఉపసంహరణపై జరుగుతోన్న ఉన్నతస్థాయి సమావేశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు వెల్లడించారు. మాల్దీవుల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఉన్న మార్గాలపై చర్చించామన్నారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నట్లు మాల్దీవుల మంత్రి మూసా జమీర్ తెలిపారు.

ఇటీవల ప్రదాని మోదీ, లక్షద్వీప్ లపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల మధ్యే తమ దేశంలో ఉన్న భారత దళాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని మాల్దీవులు కోరిన సంగతి తెలిసిందే. అక్కడ 88 మంది భారత్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×