BigTV English
Advertisement

India Maldives : భారత్‌-మాల్దీవుల వివాదం వేళ.. విదేశాంగ మంత్రుల భేటీ..

India Maldives : భారత్‌-మాల్దీవుల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. విదేశాంగ మంత్రుల మధ్య భేటీ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు లోతుగా చర్చలు జరిపారు. వీటి వివరాలను మంత్రులు తమ ఎక్స్‌ ఖాతాల్లో వెల్లడించారు.

India Maldives : భారత్‌-మాల్దీవుల వివాదం వేళ.. విదేశాంగ మంత్రుల భేటీ..

India Maldives : భారత్‌-మాల్దీవుల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. విదేశాంగ మంత్రుల మధ్య భేటీ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు లోతుగా చర్చలు జరిపారు. వీటి వివరాలను మంత్రులు తమ ట్విట్టర్ (ఎక్స్‌) ఖాతాల్లో వెల్లడించారు.


ఉగాండా రాజధాని కంపాలాలో అలీనోద్యమ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, మాల్దీవుల మంత్రి మూసా జమీర్‌తో భేటీ అయ్యారు. తమ మధ్య ఇరుదేశాల సంబంధాలపై లోతుగా చర్చ జరిగినట్లు జై శంకర్ పేర్కొన్నారు. భారత సైనికుల ఉపసంహరణపై జరుగుతోన్న ఉన్నతస్థాయి సమావేశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు వెల్లడించారు. మాల్దీవుల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఉన్న మార్గాలపై చర్చించామన్నారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నట్లు మాల్దీవుల మంత్రి మూసా జమీర్ తెలిపారు.

ఇటీవల ప్రదాని మోదీ, లక్షద్వీప్ లపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల మధ్యే తమ దేశంలో ఉన్న భారత దళాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని మాల్దీవులు కోరిన సంగతి తెలిసిందే. అక్కడ 88 మంది భారత్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.


Tags

Related News

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

Big Stories

×