E-Paper
Advertisement

India Maldives : భారత్‌-మాల్దీవుల వివాదం వేళ.. విదేశాంగ మంత్రుల భేటీ..

India Maldives : భారత్‌-మాల్దీవుల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. విదేశాంగ మంత్రుల మధ్య భేటీ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు లోతుగా చర్చలు జరిపారు. వీటి వివరాలను మంత్రులు తమ ఎక్స్‌ ఖాతాల్లో వెల్లడించారు.

India Maldives : భారత్‌-మాల్దీవుల వివాదం వేళ.. విదేశాంగ మంత్రుల భేటీ..
Advertisement

India Maldives : భారత్‌-మాల్దీవుల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. విదేశాంగ మంత్రుల మధ్య భేటీ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు లోతుగా చర్చలు జరిపారు. వీటి వివరాలను మంత్రులు తమ ట్విట్టర్ (ఎక్స్‌) ఖాతాల్లో వెల్లడించారు.

ఉగాండా రాజధాని కంపాలాలో అలీనోద్యమ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, మాల్దీవుల మంత్రి మూసా జమీర్‌తో భేటీ అయ్యారు. తమ మధ్య ఇరుదేశాల సంబంధాలపై లోతుగా చర్చ జరిగినట్లు జై శంకర్ పేర్కొన్నారు. భారత సైనికుల ఉపసంహరణపై జరుగుతోన్న ఉన్నతస్థాయి సమావేశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు వెల్లడించారు. మాల్దీవుల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఉన్న మార్గాలపై చర్చించామన్నారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నట్లు మాల్దీవుల మంత్రి మూసా జమీర్ తెలిపారు.

Advertisement

ఇటీవల ప్రదాని మోదీ, లక్షద్వీప్ లపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల మధ్యే తమ దేశంలో ఉన్న భారత దళాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని మాల్దీవులు కోరిన సంగతి తెలిసిందే. అక్కడ 88 మంది భారత్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Tags

Related News

అమెరికాలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి!

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×