California Accident: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది.
వీరంతా హైదరాబాద్లోని ఐఎస్ సదన్ ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ నవీద్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. సరదాగా గడపడానికి, పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన షేక్ అబ్దుల్ నవీద్, నజేయా సల్మా దంపతులు, వారి ముగ్గురు పిల్లలు ప్రయాణిస్తున్న కారు కాలిఫోర్నియాలో ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో సల్మా(45), కుమార్తె నిహాయీన్ షేక్ (19), కుమారుడు ఉమర్ షేక్(14) ప్రాణాలు కోల్పోయారు. షేక్ అబ్దుల్, ఐదేళ్ల చిన్నారి ఖదీజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రక్తపు మడుగులో ఉన్న బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!