Putin Praises India : రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశం, భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు. నవంబర్ 4న రష్యా ఐక్యతా దినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ఆయన భారత్పై ప్రశంసలు గుప్పించారు. దేశం కోసం కృషి చేసే ఎంతో మంది భారత్లో ఉన్నట్లు చెప్పారు. 150 కోట్ల మంది జనాభాతో భారత్ సమర్ధవంతమైన దేశంగా ఉంది. భవిష్యత్తులో భారత్ మరింత అభివృద్దితో ముందుకు వెళ్తుందన్నారు పుతిన్.
ఇటీవల ప్రధాని మోదీని సైతం ప్రశంసలతో ముంచెత్తారు రష్యా అధ్యక్షుడు. మోదీ గొప్ప దేశభక్తుడన్నారు. మోదీ విదేశాంగ విధానంతో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తు మొత్తం భారత్దే అన్నారు. అయితే వచ్చే వారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా పర్యటనలో ఉండనున్నారు. అక్కడ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్ భేటీ కానున్నారు.
నవంబర 7, 8 తేదీల్లో జరగనున్న ఈ మీటింగ్లో జైశంకర్ కీలక అంశాలను చర్చించనున్నారు. ఉక్రెయన్ డర్టీ బాంబ్ తయారు చేస్తోందని రష్యా బాంబు పేల్చిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు ఇప్పుడు భీకర యుద్ధంలో ఉన్నాయి. ప్రపంచ శాంతి, అణు ఆయుధాలను వాడకుండా చర్యలు, లాంటి అంశాలను జయశంకర్, రష్యా విదేశాంగ మంత్రితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.