E-Paper
Advertisement

Parenting: పబ్లిక్‌లో అందరిముందు పిల్లలను తిట్టడం ఎంత ప్రమాదమో తెలుసా?

Parenting: పబ్లిక్‌లో అందరిముందు పిల్లలను తిట్టడం ఎంత ప్రమాదమో తెలుసా?

పిల్లలను పెంచడం ప్రతి తల్లిదండ్రికి ఒక పెద్ద బాధ్యత. పిల్లలు తప్పులు చేయడం సహజం. ఆ తప్పులను సరిదిద్దడం కూడా అవసరం. అయితే పిల్లలను ఎలా మందలిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. సైకాలజిస్టులు చెబుతున్న ప్రకారం పిల్లలను ఎప్పుడూ పబ్లిక్‌లో అంటే ఇతరుల ముందు మందలించకూడదు. ఇది చిన్న విషయం లాగా అనిపించినా పిల్లల మనసుపై దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది.

చిన్నచూపుగా భావిస్తారు
పిల్లలను అందరి ముందు మందలిస్తే వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఒక పిల్లవాడిని ఇతరుల ముందు మందలిస్తే అతనికి అవమానం, సిగ్గు కలుగుతుంది. నేను తప్పు చేశాను అన్న భావనకంటే, నేను మంచివాడిని కాదు అనే భావన ఎక్కువగా కలుగుతుంది. ఈ భావన వల్ల పిల్లల్లో నమ్మకం తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో ఇది వారి వ్యక్తిత్వంపై కూడా ప్రభావం చూపుతుంది. స్కూల్‌లో, స్నేహితులతో కూడా వారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు.

విపరీతమైన భయం
పబ్లిక్‌లో మందలించడం వల్ల పిల్లల్లో భయం పెరుగుతుంది. తల్లిదండ్రులను చూసి భయపడటం మొదలవుతుంది. చిన్న తప్పు చేసినా పెద్దగా శిక్ష పడుతుందని అనుకుంటారు. ఈ భయం వల్ల వాళ్లు తమ అభిప్రాయాలు చెప్పడానికి కూడా వెనుకాడుతారు. కొన్నిసార్లు ఇది ఆందోళన (anxiety)గా మారుతుంది. ఇతరుల ముందు మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది.

Also read: Hair Growth tips: వేసవిలో జుట్టు రాలిపోకుండా సులువైన హెయిర్ గ్రోత్ చిట్కాలు

తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. పిల్లలకు తల్లిదండ్రులు ఒక భద్రత కలిగించే వ్యక్తులుగా ఉండాలి. కానీ అందరి ముందు మందలిస్తే, నా అమ్మా నాన్న నన్ను కాపాడరు అనే భావన కలుగుతుంది. దీంతో పిల్లలు తమ సమస్యలు, భావాలు తల్లిదండ్రులతో పంచుకోవడం తగ్గిస్తారు. ఇది సంబంధాన్ని బలహీనంగా చేస్తుంది.

కోపం పెరుగుతుంది
పబ్లిక్‌లో మందలించడం వల్ల పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోరు. వాళ్లు తమ తప్పు గురించి ఆలోచించకుండా, ఎవరెవరు చూస్తున్నారు? అనే దానిపైనే దృష్టి పెడతారు. కొన్నిసార్లు అవమానంతో కోపం కూడా వస్తుంది. దీని వల్ల వారు మరింత జిడ్డు ప్రవర్తన చూపించే అవకాశం ఉంది.

పిల్లలను ఎలా డిసిప్లిన్ చేయాలి?
సైకాలజిస్టులు కొన్ని మంచి మార్గాలను సూచిస్తున్నారు. ముందుగా పిల్లలను పక్కకు తీసుకెళ్లి నెమ్మదిగా మాట్లాడాలి. కోపంతో కాకుండా ప్రశాంతంగా చెప్పాలి. పిల్లలు చేసిన తప్పు గురించి వివరంగా తెలుసుకోవాలి. నువ్వు చేసిన పని సరైంది కాదు అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు తమ తప్పును అర్థం చేసుకుంటారు.

తప్పు చేసినప్పుడు దాన్ని ఎలా సరిచేయాలో కూడా చెప్పాలి. పిల్లలు మంచి పని చేసినప్పుడు ప్రశంసించాలి. ఇలా చేస్తే వాళ్లలో నమ్మకం పెరుగుతుంది. తల్లిదండ్రులతో సంబంధం కూడా బలపడుతుంది. పిల్లలను మందలించడం తప్పు కాదు. కానీ అది ఎక్కడ, ఎలా చేస్తున్నామనేది చాలా ముఖ్యం. పబ్లిక్‌లో మందలించడం వల్ల పిల్లల మనసుకు గాయమవుతుంది.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×