E-Paper
Advertisement

Earthquake: కాలిఫోర్నియా టూ కాశ్మీర్.. 12 గంటల్లో వరుస భూకంపాలు.. అసలేం జరుగుతోంది

Earthquake: కాలిఫోర్నియా టూ కాశ్మీర్.. 12 గంటల్లో వరుస భూకంపాలు.. అసలేం జరుగుతోంది

Earthquake: ప్రపంచ దేశాలు ప్రస్తుతం భూ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. కాశ్మీర్ నుంచి మొదలుకుని కాలిఫోర్నియా వరకు కేవలం 12 గంటల్లోనే భూకంపాలు సంభవించడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ప్రపంచ దేశాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా భారీ భూకంపాలు సంభవించాయి. గురు, శుక్రవారాల్లో భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. ఈ మేరకు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. రాత్రి 11 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది.

రాజస్థాన్..

రాజస్థాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 1.29 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. అయితే అర్థరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోను గురువారం రాత్రి భూకంపం సంభవించింది.

న్యూయార్క్, న్యూజెర్సీ..

న్యూయార్క్, ఉత్తర న్యూజెర్సీలలో భూకంపాలు సంభవించాయి. న్యూజెర్సీలో భూకంప తీవ్రత 4.0గా నమోదనట్లు భూకంప కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లోను భూమి కంపించిందని.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.

ఉత్తర కాలిఫోర్నియా

ఉత్తర కాలిఫోర్నియాలో శుక్రవారం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 4. 4 తీవ్రతతో సంభవించినట్లు భూకంప కేంద్రం ప్రకటించింది. దాదాపు 7 సార్లు వేర్వేరు సమయాల్లో భూకంపాలు సంభవించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మయన్మార్‌లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×