E-Paper
Advertisement

Pakistan : పాకిస్థాన్‌ లో ఆత్మాహుతి దాడి.. 93 మంది మృత్యువాత..

Pakistan : పాకిస్థాన్‌ లో ఆత్మాహుతి దాడి.. 93 మంది మృత్యువాత..
Advertisement

Pakistan : పాకిస్థాన్‌ లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పెషావర్‌ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. బాధితులను వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పెషావర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్‌ లైన్స్‌లోని ఓ మసీదులో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

ఆత్మహుతి దాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌ మండిపడ్డారు. పాకిస్థాన్ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని, ఉగ్రవాదులు భయాన్నిసృష్టించాలని అనుకుంటున్నారని విమర్శించారు.

సోమవారం యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆ పర్యటన కాస్తా రద్దయింది. అలాగే పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు దేశంలో ఇలాంటి ఉగ్రదాడులు జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×