E-Paper
Advertisement

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!
Advertisement

Sonam Wangchuk: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు దిల్లీలోని ఆస్పత్రి వేదికగా ప్రకటించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ నాయకులను పార్లమెంట్ సభ్యులను కలవడానికి అనుమతించే వరకు.. లేదా ఎంపీలే తన వద్దకు వచ్చే వరకు తన దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు వాంగ్‌చుక్ చేతిరాతతో రాసిన లేఖను ఆయన భార్య గీతాంజలి అంగ్మో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘నేను నా నిరాహార దీక్షను (23వ రోజు) కొనసాగిస్తాను. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై జరిగిన హింసను చూశాక ఈ నిర్ణయం తీసుకున్నాను. యువ నాయకులను పార్లమెంట్ భవన్‌లో ఎంపీలతో కలవడానికి అనుమతించే వరకు లేదా ఆస్పత్రిలో కలిసేందుకు అనుమతించే వరకు నా దీక్ష ఆగదు’ అని ఆయన సంతకంతో కూడిన ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు విద్యాశాఖ మంత్రిపై త్వరలోనే కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు వాంగ్ చూక్ అన్నారు.

Advertisement

Also Read: ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

దిల్లీలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత సోమవారం ఆందోళన చేశారు. దీనిపై కూడా సోనమ్ స్పందించారు. పోలీసులు, ప్రభుత్వం నుండి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా విద్యార్థులు చూపిన ఓర్పు తన్ను ఎంతో కదిలించిందని ఆయన తెలిపారు. ఇవాళ లేదంటే రేపు పార్లమెంట్ ముందు తమ సమస్యలను చెప్పుకునేందుకు విద్యార్థులను అనుమతించి ఈ వివాదానికి సున్నితంగా పరిష్కారం చూపాలని ప్రభుత్వం, పోలీసులను ఆయన కోరారు. ఆందోళనకారులు గతంలాగే రాబోయే రోజుల్లో కూడా శాంతి, సహనాలను పాటిస్తారని ఆశిస్తున్నట్లు తన సందేశంలో వాంగ్ చుక్ పేర్కొన్నారు.

Advertisement

Also Read: భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×