E-Paper
Advertisement

IND VS USA: జ‌స్ట్ మిస్‌..USA దెబ్బ‌కు చావు దాకా వెళ్లి వ‌చ్చిన‌ టీమిండియా, కానీ సూర్య అడ్డుగా నిల‌బ‌డ్డాడు

IND VS USA: జ‌స్ట్ మిస్‌..USA దెబ్బ‌కు చావు దాకా వెళ్లి వ‌చ్చిన‌ టీమిండియా, కానీ సూర్య అడ్డుగా నిల‌బ‌డ్డాడు

IND VS USA: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( India vs United States of America) జట్ల మధ్య మూడవ మ్యాచ్ జరిగింది. ముంబైలోని వంకడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి, టోర్నమెంట్ శుభా రంభం చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుపైన ఏకంగా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. బ్యాటింగ్ లో సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) అదరగొట్టగా, బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్, అక్ష‌ర్ ప‌టేల్ రాడ్ దింపేశారు. దీంతో టీమిండియా ఈ టోర్నమెంట్ లో బోణీ కొట్టింది. ఒకానొక స‌మ‌యంలో టీమిండియా ఓడిపోతుంద‌ని అందరూ అనుకున్నారు. కానీ సూర్య బ్యాటింగ్ వ‌ల్లే టీమిండియా గెలిచింది. అంటే USA దెబ్బ‌కు చావు దాకా వెళ్లి టీమిండియా వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ ఇదే, ఆసీస్ కు ఎదురుదెబ్బ‌..టీమిండియా మ్యాచ్ లు ఎక్కడ ఉచితంగా చూడాలంటే

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు పై గ్రాండ్ విక్టరీ

ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) నేపథ్యంలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది ఇండియా. ఈ మ్యాచ్ లో ఏకంగా 29 పరుగులు తేడాతో విజయం సాధించింది టీమిండియా. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది. దీంతో 300 కొట్టడం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా టాపార్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ చాలా దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు ఆడిన టీమిండియా, 9 వికెట్ల నష్టానికి 161 పరుగుల లక్ష్యాన్ని అమెరికా ముందు ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తేలిపోయింది. ఈ మ్యాచ్ లో 162 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో యూఎస్ఏ పోరాడి ఓడిపోయింది. 20 ఓవ‌ర్లు ఆడిన యూఎస్ఏ జ‌ట్టు 132 ప‌రుగులు సాధించి, 8 వికెట్లు న‌ష్ట‌పోయింది. దీంతో టీమిండియా 29 ప‌రుగుల తేడాతో గెలిచింది.

సూర్య కుమార్ యాదవ్ వన్ మ్యాన్ షో

ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో టీమిండియా మొదటి మ్యాచ్ లో విజయం సాధించడం వెనుక సూర్య కుమార్ యాదవ్ కష్టం ఉంది. అతని వన్ మ్యాన్ షో కారణంగా టీమిండియా విజయం సాధించిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 20 పరుగులు సాధించగా అభిషేక్ శర్మ డక్ ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ 25 పరుగులతో రాణించగా శివం దూబే డక్ ఔట్ అయ్యాడు. రింకు సింగ్ ఆరు పరుగులు సాధించగా హార్దిక్ పాండ్యా 5 పరుగులతో విఫలమయ్యారు. మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా 14 పరుగులతో తేలిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులు చేసి ఇరగదీశాడు. నాలుగు సిక్సర్ లతో పాటు పది బౌండరీలు సాధించాడు. వికెట్లు పడుతున్న బాహుబలి లాగా ఇండియా ఓటమిని తప్పించాడు సూర్య. దీంతో సూర్య కుమార్ యాదవ్.

Also Read: Scotland Cricket Team: ఇండియాలో అడుగుపెట్టిన స్కాట్లాండ్‌…పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ఇక గాజులు వేసుకోవాల్సిందే ( India vs Pakistan)

 

Related News

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

Big Stories

×