E-Paper
Advertisement

Revanth Reddy: రైతులకు 24 గంటల కరెంట్ అందుతున్నట్ల నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా : రేవంత్ రెడ్డి

Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. రాజేంద్రనగర్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు

Revanth Reddy: రైతులకు 24 గంటల కరెంట్ అందుతున్నట్ల నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా : రేవంత్ రెడ్డి
Revanth Reddy Latest Speech

Revanth Reddy Latest Speech(Telangana today news):

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. రాజేంద్రనగర్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ” తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నిరూపిస్తే.. శంషాబాద్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తాను,” అని గులాబీ పార్టీకి సవాలు చేశారు.

తెలంగాణలో కేసీఆర్ సాధించిన అభివృద్ధి బెల్టు షాపులు పెంచడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో అంతార్జాతీయ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ కాంగ్రెస్ నిర్మించిందని.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ పార్టీతోనే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, తాగుడులో తెలంగాణను నంబర్‌ వన్‌ చేశారని రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎందరికి ఇచ్చారని, కాంగ్రెస్‌ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4 వేలు పెన్షన్‌ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×