Actress Udaya Bhanu: యాంకర్ ఉదయభాను (Udaya Bhanu)అంటేనే ఒక ఎనర్జీ. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ‘D/O ప్రసాద్ రావు’ అనే వెబ్ సిరీస్తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే, గతంలో యాంకర్ సుమకు, ఉదయభానుకు మధ్య విభేదాలు ఉన్నాయని, ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకున్నారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. మొన్నామధ్య జరిగిన మూవీ ప్రెస్ మీట్లో ఉదయభాను ఈ అంశాలపై తనదైన శైలిలో స్పందించి, అసలు నిజాన్ని బయటపెట్టారు.
చాలా కాలంగా సోషల్ మీడియాలో సుమ మరియు ఉదయభాను మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉదయభాను స్పందిస్తూ, అవన్నీ కేవలం పుకార్లేనని తేల్చి చెప్పారు. తామిద్దరం ఇండస్ట్రీలో కలిసి ఎదిగామని, ఒకరిపై ఒకరికి గౌరవం ఉందని పేర్కొన్నారు. కొన్నిసార్లు మాటలను వక్రీకరించి చూపించడం వల్ల ఇలాంటి అపార్థాలు వస్తాయని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఒకరి ఎదుగుదలను మరొకరు ఎప్పుడూ గౌరవిస్తామని చెబుతూ ట్రోలర్లకు చెక్ పెట్టారు.
‘D/O ప్రసాద్ రావు’ సిరీస్లో ఉదయభాను ‘రెబెకా జోసెఫ్’ అనే డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలని కలలు కన్నానని, ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో క్లైమాక్స్ సీన్స్ చేస్తున్నప్పుడు ఒక తల్లిగా తాను ఎంతో ఎమోషనల్ అయ్యానని, కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చారు. ఈ కథ ప్రతి తల్లీకూతుళ్లకు, ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
also read:Suma Cash Show: సుమ “క్యాష్” ప్రోగ్రాంలో గెలిచిన వారికి లక్షలు.. నిజం బయటపెట్టిన కమెడియన్ సుదర్శన్!
తన కెరీర్ ఇనిషియల్ డేస్ లో జీ తెలుగు తనకు ఎంతో స్టార్డమ్ను ఇచ్చిందని, మళ్ళీ అదే సంస్థ ద్వారా ఈ సిరీస్ రావడం సంతోషంగా ఉందని ఉదయభాను అన్నారు. రాజీవ్ కనకాలతో కలిసి పనిచేయడం పాత జ్ఞాపకాలను గుర్తు చేసిందని, తమది ఒక ఫ్యామిలీ లాంటి రిలేషన్ అని తెలిపారు. ఇక ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, నటిగా తనను మరో మెట్టు ఎక్కిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.