Krishna Kaushik : బిగ్ బాస్ షో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో విపరీతమైన రేటింగ్స్ తీసుకొస్తుంది ఈ షో. సీజన్ వన్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. రెండవ సీజన్ కి నాని వచ్చారు. ఆ తర్వాత నుంచి నాగార్జున కంటిన్యూ అవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా బాలాదిత్య ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. అతని గేమ్ కూడా కొంతమేరకు ఆకట్టుకుంది.
రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఆ సీజన్లో సక్సెస్ సాధించారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు బాలాదిత్య తేరుకోలేదు అని తన సోదరుడు కృష్ణ కౌశిక్ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా డిస్టర్బ్ అయిపోయారట. అక్కడ దానికి అలవాటు పడిపోయినా తర్వాత బయటకు వచ్చినప్పుడు అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది.
బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత విపాసన కు వెళ్ళాడు. కూర్చుని కాఫీ తాగినప్పుడు కూడా ఝుమ్మని సౌండ్ వచ్చేది. కారణం ఏంటంటే వాడు ఒక దానికి అలవాటు పడిపోయాడు. లోపల చూసిన మనుషులని చూడటం, సరిగ్గా టైం తెలియకపోవటం, అలానే రోజులు తెలియకపోవడం. కేవలం నాగర్జున వచ్చిన రోజే శనివారం అని తెలియటం ఇవన్నీటికి వాడు అలవాటు పడిపోయాడు.
హౌస్ లో జరిగే కొన్ని టాస్కులు వలన టైం కి ఫుడ్డు ఉండదు. ప్రాపర్ గా నిద్ర ఉండదు. దీని వలన వాడు చాలా ఇబ్బంది పడిపోయాడు. మామూలుగా ఏదైనా గొడవ అయితే నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడడం. కానీ హౌస్ లో మాత్రం అది తప్పదు.
నేను బిగ్ బాస్ షో కి వెళ్తే మొత్తం బీపులు మాత్రమే వినిపిస్తాయి. నేను ఏదైనా చాలా ముక్కు సూటిగా మాట్లాడుతుంటాను. నాలాంటి వాడు అసలు ఆ షోలో ఉండలేడు అంటూ కౌశిక్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు రివిల్ చేశాడు.
లేడీస్ కి నేనంటే చాలా ఇష్టం కౌశిక్ అనే వాడికి మంచి పేరు ఉంది. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఆ ఉన్న పేరు కూడా పోతుంది. సీరియల్స్ లో బాగా పాపులర్ అయినప్పుడు ఫిమేల్ ఫాలోయింగ్ కూడా నాకు విపరీతంగా ఉండేది. ఇంట్లో మా ఆవిడకి కూడా ముందే చెప్పేసి నాకు కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ అని ఒప్పించి కన్విన్స్ చేసి చేసేసుకున్నాను అని చెప్పాడు.
Also Read: Nandamuri Balakrishna : మద్రాస్ నా జన్మభూమి, నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్