Vindhya Vishaka : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టీవీ షోలో ఎంతోమంది యాంకర్లు కనిపిస్తూ ఉంటారు. జనాలని ఎంటర్టైన్ చేస్తూ వాళ్లకు కావాల్సిన విధమైన పాటలు లేదా సమాచారాన్ని అందించే వాటిలలో యాంకర్లు ఎప్పుడూ ముందుగానే ఉంటారు.. ప్రస్తుతం టాప్ యాంకర్స్ గా ఉన్న వారిలో వింధ్య విశాఖ ఒకరు. బుల్లితెర తెలుగు యాంకర్ వింధ్య విశాఖ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. ఈమె ఎన్నో షోలలో యాంకర్ గా చేసి ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. న్యూస్ రీడర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన ఈమె యాంకర్ గా సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె యాంకర్ గా చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంది. ఇదిలా ఉండగా యాంకర్ వింధ్య నెలకు ఎన్ని లక్షల సంపాదిస్తుంది అన్నది సోషల్ మీడియాలో ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి యాంకర్ వింధ్య నెలకు ఎన్ని లక్షల సంపాదిస్తుందో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ఒకప్పుడు బుల్లితెరపై సక్సెస్ టాక్ తో ప్రసారం అయిన ఫ్యామిలీ సర్కస్, హంగామా, సఖీ, మా టీవీలో మా ఊరి వంట, నువ్ రెడీ నేను రెడీ తదితర టీవీ షోస్, కార్యక్రమాలు చేసి యాంకర్ గా మంచి క్రేజ్ ను అందించాయి.. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో స్పోర్ట్స్ ప్రజెంటర్ గానూ చేరింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు అమ్మాయిగా అరుదైన ఘనత అందుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఒక్కో షో తో తన టాలెంట్ నిరూపించుకుంటూ అత్యధిక రెమ్యూనరేషన్ కూడా అందుకుంటూ వచ్చింది. గతంలో ఈమె ఎన్నో షోలకు హోస్ట్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.. అయితే వింధ్య ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఈ క్రమంలో జనాలకి ఆమె ఎన్ని లక్షల సంపాదిస్తుందో అని అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి.. నిజానికి వింధ్య నెలకు 15 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈమె అక్కడ కూడా ఒక నాలుగు ఐదు లక్షలు వరకు నెలకు సంపాదిస్తుంది అని తెలుస్తుంది. ఈ లెక్కన వింధ్య నెలకు 20 లక్షలకు పైగా సంపాదించి సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఒక యాంకరు ఇన్ని లక్షల సంపాదించడం మామూలు విషయం కాదు అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు..?
అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంటూ వస్తున్న వింధ్య ఆమె కెరియర్ స్టార్టింగ్ లో న్యూస్ రీడర్గా మొదలు పెట్టింది. పలు చానల్స్ లలో పని చేసిన అనుభవం కూడా ఈమెకుంది.. ఆ తర్వాత పలు సినిమా ఈవెంట్స్ లలో యాంకర్ గా చేసింది. ఈమె చేసే ప్రతి షో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. అంతేకాదు స్వేచ్ఛ వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.. ఇకపోతే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉన్న ఈమె లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ మధ్య గ్లామర్ గేట్లు ఎత్తేసింది.. హాట్ లుక్ లో దర్శనం ఇస్తుంది..ఆ ఫోటోలు ట్రెండ్ అవుతుంటాయి. రీసెంట్ గా వింధ్య తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. అందాలతో గ్లామర్ ఓవర్ లోడెడ్ పిక్స్ ను షేర్ చేస్తుంది.