Gundeninda GudiGantalu Today episode April 20 th : నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ విలేజ్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.. ఇంట్లోకి వెళ్లగానే రెస్ట్ తీసుకోవాలని రోహిణి మనోజ్, శృతి అంటారు. మరోవైపు ప్రభావతి కూడా కాస్తా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది. ఎవరి గదుల్లోకి వారు వెళ్లాలని అనుకుంటారు. మీనాను ప్రభావతి కాఫీ అడుగుతుంది. దాంతో పూలకొట్టు తీశాక ఇస్తానని బదులిస్తుంది. సత్యం కాఫీ ఇచ్చాక ఆ పని చేసుకో అని చెప్తాడు. ఇక ప్రభావతి వచ్చిందని తెలుసుకొని కామాక్షి అక్కడకు వస్తుంది. ఇద్దరి మధ్య కామెడీ కాస్త అందరిని నవ్విస్తుంది.. ప్రభావతి కామక్షితో ఒంటిరిగా మాట్లాడాలని అంటుంది. హాల్ లో కాకుండా గదిలో కూర్చొని మాట్లాడుకుందామని అంటుంది. అక్కడ ప్రభావతికి ఒక్క గది కూడా దొరకదు. ముందుగా రవి, శృతి వాళ్ళ గదికి వెళ్తే షాక్ అవుతారు.. చివరగా బాలు రూమ్ కు వెళ్తే బాలు దెబ్బకు తట్టుకోలేక టెర్రస్ పైకి వెళ్లి కూర్చుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. కామాక్షి నీకు రూమ్ కూడా లేదు అని ఏద్దేవా చేస్తుంది. ఇక ప్రభావతి తన బిజినెస్ గురించి చెబుతుంది. ప్రభావతి స్పందిస్తూ నాకంటూ ప్రత్యేకమైన గదిలో లేకుండా పోయిందని అంటుంది. పైన ఒక గది కట్టించుకోని హాయిగా ఉండండి అని బదులిస్తుంది. దానికి ప్రభావతి కూడా స్పందిస్తూ అదే అనుకున్నాం. కానీ అందరికి సరిపడా రూమ్ లు ఉంటే బాలు, మీనాను బయటికి గెంటేయడం వీలవ్వదు కదా అని అంటుంది. వారిని బయటికి పంపించాక మూడంతస్తుల మేడ కట్టుకుంటామని ఇక్కడ హాల్, ఇక్కడ టీవీ యూనిట్, ఇక్కడ స్విమ్మింగ్ ఫూల్ అని చెబుతుంది.. పూల కొట్టు గురించి మాట్లాడుతుంది. దాన్ని పీకేస్తే అదే పోతుందని అంటుంది.
అప్పుడే మీనా కాఫీ తీసుకొని పైకి వస్తుంది. కానీ అక్కడ మాటలు విన్నదా అని ప్రభావతి అడుగుతుంది. కానీ మీనా మాత్రం ఏమి మాట్లాడ కుండా కాఫీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని రూమ్ నాటకం ఆడుతుంటుంది ప్రభావతి. ఇక తన వదిన కామాక్షిని ఇంటికి పిలిపి మాట్లాడుకోవడాని ఒక గది కూడా లేకుండా పోయిందని నుసుగుతుంది. ఎట్టకేళలకు బిల్డింగ్ మీదకు వెళ్లి మాట్లాడుకుంటారు. అక్కడ మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ఆ తర్వాత 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటామని కామక్షి వివరిస్తుంది. ఆ మాటలను మీనా వింటుంది.
అలాగే మరోవైపు బాలు కారు రైడ్ కోసమని బయటికి వెళ్తాడు. ఈ క్రమంలో ఒక రైడ్ రోహిణి పార్లర్ కు పడుతుంది. నేరుగా అక్కడికి వెళ్లిన బాలు కారు ఎక్కిన ఆవిడా డబ్బులు ఇవ్వకపోవడంతో పార్లర్ లోకి వెళ్తాడు. డబ్బులు ఇవ్వమని అడిగి తీసుకుంటాడు. అయితే అప్పటికే ఆ పార్లర్ లో మాణిక్యం, రోహిణి, రోహిణి స్నేహితురాలు దివ్య ఉంటుంది. మాణిక్యం ను అక్కడ నుంచి మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే బాలు అక్కడకు వచ్చి డబ్బులు ఇవ్వలేదు మేడం అని లోపలికి వెళ్లి అడుగుతాడు.
రోహిణి వాళ్ల ఓనర్ రోహిణిని పిలుస్తూ ఉంటుంది. మరోవైపు పార్లర్లోని అన్ని పనులను చేయిస్తూ ఉంటుంది. అన్ని పనులు సరిగా చూసుకోవాలని కూడా చెబుతూ ఉంటుంది. ఇవన్నీ బాలు గమనిస్తూ ఉంటాడు. మరోవైపు పార్లర్లోని అన్ని పనులను చేయిస్తూ ఉంటుంది. అన్ని పనులు సరిగా చూసుకోవాలని కూడా చెబుతూ ఉంటుంది. ఇవన్నీ బాలు గమనిస్తూ ఉంటాడు. ఇక పార్లర్ తనది కాదనే నిజం తెలిసిపోవడంతో రోహిణి గుట్టు ఇంట్లో బయట పెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇక ఇంటి వెళ్తాడు. వెళ్లగానే రోహిణి కూడా పార్లర్ నుంచి తిరిగి వస్తుంది. దీంతో ప్రభావతి ఇవ్వాళ బాగా పనిచేశావు అనుకుంటా అమ్మ అని అంటుంది. దాంతో బాలు అవును ఆవిడ పార్లర్ లో బ్యూటీషన్లే కంటే ఓనర్లే ఎక్కువ పనిచేస్తున్నారని అంటాడు.. అందరు బాలు విని షాక్ అవుతారు. రోహిణి నిజం తెలిసి పోయిందా? అని కంగారు పడుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో మొత్తం గుట్టు బయటపడుతుందేమో చూడాలి..