Gundeninda GudiGantalu Today episode march 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఫారిన్ బ్రాండ్ ఎలా ఉంటుంది అని మణికంఠను అడిగి తెలుసుకుంటాడు.. మొత్తానికి బాలు తాగడానికి ఫిక్స్ అవుతాడు.. భోజనాలు చాలా బాగున్నాయి నీ ప్రభావతి సత్యం కామాక్షి ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తారు.. బాలు మీనా ఇక ఇంటికి వెళ్దాం పదండి అని అనగానే.. నువ్వు ఇక్కడ ఉండకపోతే మీ ముగ్గురు మధ్య ఏదో గొడవలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండాలని అంటాడు. ఆ తర్వాత ప్రభావతి నువ్వు ఏదైనా అనగానే అంటుంది.. ఇక ముఖేష్ పార్టీకి మనోజ్ నీ రమ్మని పిలుస్తాడు. ముఖేష్ రాదని మణికంఠ అతనికి మందు సర్వ్ చేస్తాడు. మనోజ్ ఎంత వద్దని చెప్పినా సరే అతను వినకుండా మందు పోస్తాడు. మనోజ్ మందు తాగడం వద్దని అంటున్న కూడా అతను బలవంతం చేయడంతో తాగుతాడు. బాలు ఎంతగా వద్దని చెప్పినా సరే ఆ ముఖేష్ బలవంత పెట్టి తాగాల్సిందేనని కూర్చుంటాడు.
ఏంటి నన్ను తాగొద్దని అంటున్న కూడా మీరు తాగమని బలవంతం చేస్తున్నారు అని అనగానే రవి.. మా అన్నయ్య ఒక పెగ్గుతో అసలు ఆగడు మొత్తం తాగేస్తాడు అని రవి అంటాడు. ఇక బాలుకి పెగ్గు కలపగానే క్షణాల్లో పెగ్గు తాగేస్తాడు. మళ్లీ పోయేలా అని అంటే పొయ్యడం ఎందుకు నేనే పోసుకుంటాను అని అక్కడున్న బాటిల్ నెత్తి మొత్తం తాగేస్తాడు. బాలు ఇక పాటలతో రచ్చ రచ్చ చేస్తాడు. అయితే విద్య ఇదే కరెక్ట్ టైం అని తన ఫోన్ కొట్టేయాలని అనుకుంటుంది.. ఇక ముగ్గురు కలిసి ఇంటికి వెళ్లడానికి వచ్చేస్తారు వాళ్ళ ముగ్గుని తీసుకెళ్లే క్రమంలో రోహిణి బాలు ఫోన్ కొట్టేసి మనోజ్ కోర్టులో పడేస్తుంది. ముగ్గురిని చూసి సత్యం ప్రభావతి దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ముగ్గురు పీకలదాకా తాగి రావడం చూసినా సత్యం షాక్ అవుతాడు.. ఏంటి ఇలా జరిగింది అని సత్యం అడుగుతాడు. పార్టీలో వీలు ముగ్గురి ఎంత చెప్తున్నా వినకుండా తాగొచ్చారు మావయ్య అని చెప్తున్నా సరే సత్యం మాత్రం వీళ్లు ఇంకా మారరు అని అంటాడు. ఇక ముగ్గురు కలిసి పొంతన లేకుండా మాట్లాడడం చూసిన సత్యం ఇంకా సీరియస్ అవుతాడు.. ముగ్గురు అన్నదమ్ములు కలిసి తాగు వచ్చి ఇంటి దగ్గర పెద్ద రచ్చ చేస్తారు. అవును ఈ అంకుల్ ఎవరు ఎక్కడున్నారు ఏంటి అని ఆ ముగ్గురు సత్యం మీ అనగానే ఏంటి నేను అంకుల్ నా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఇక బాలు కూడా ఆ ఇద్దరితో కలిసి సత్యంని అనడంతో ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు.. ఈ ముగ్గురిని ఏం చేయమంటారు మీ ముగ్గురు చెప్పండి అని సత్యం అంటారు.
ఇక ప్రభావతి ఇంట్లో నుంచి బయటికి రాగానే ఏంటి ముగ్గురు ఇలా తాగొచ్చారు. అంతా బాలు గడి పనేనా ఏంటి మీనా వాళ్ళలా మాట్లాడుతుంటే మాట్లాడవేంటి అని మీనాతో సీరియస్ గా మాట్లాడుతుంది.. ఇంకా ప్రభావతిని చూసినా ఆ ముగ్గురు ఏంటి ఆంటీ ఎవరు మన ఇంట్లో ఉండే ఇంటి అని వెటకారంగా మాట్లాడేస్తారు. ఏంట్రా నేను ఆంటీనా నువ్వు ఇంకా ఆంటీ వే నేను అంకుల్ని కూడా అనేసి సత్యం అంటాడు… వీళ్ళిద్దరూ ఇలా మారడానికి కారణం ఈ బాలు గాడి అయి ఉంటాడు అని ప్రభావతి అంటుంది.. వాళ్ళు ముగ్గులు తాగొచ్చారు నువ్వు ఎందుకు బాలునే అది ఇది అని అంటున్నావ్ అని సత్యం అంటాడు..
ఆయనే ఒక్కడు ఏం చేశాడు. మీరిద్దరూ తాగడానికి కారణం ఎవరు చెప్పు రోహిణి ఏం మాట్లాడవేంటి అని మీనా అంటుంది. అవును మనోజ్ వాళ్ళిద్దర్నీ తాగమని బలవంతం చేశాడు అని అంటుంది. అయితే ఈ రాత్రికి వీళ్ళు ముగ్గురు బయటే ఉండాలి మీ ముగ్గురు లోపలికి రండి నేను మీ గురించి ఆలోచించి చెప్తున్నాను అని సత్యం అంటాడు.. వాళ్ళు ముగ్గురు బయట ఎలా పడుకుంటారు మామయ్య అని అనగానే ఎలాగైనా పడుకొనివ్వండి వాళ్ళకి ఈ రోజు ఇవాళ ఇదే పనిష్మెంట్ అని అంటారు.. మీరు ముగ్గురు నా మాట విని లోపలికి వస్తారా అని సత్యం అనగానే లోపలికి వస్తారు. మావయ్య వాళ్ళకు కనీసం చాపదుపటన ఇద్దాం మావయ్య అని మీ నాన్నగానే సరే అమ్మ ఇచ్చేస్తా అని అంటాడు.. ఇక బాలు కోసం మీనా ఒక్కటే హాల్లో కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది.
ఎలాగైనా సరే ఇవాళ ఫోన్ కొట్టేయాలని ఫిక్స్ అయిన రోహిణి మాత్రం కిందకి రాగానే.. మీనా చూసి ఈ ఫోన్ కొట్టేసేందుకు వస్తే మీనా ఇక్కడే ఉంది ఎలా అనేసి మళ్లీ పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఎక్కిళ్ళు వస్తున్నాయని మీనాక్షి బాటిల్లో వాటర్ ఇవ్వమని బాలు అడుగుతాడు.. బాలు లోపలికి వస్తుంటే మీనా మావయ్య గారు లోపలికి రావద్దని చెప్పారండి అని అంటుంది. మా నాన్న మాటని నేను ఎప్పుడూ తప్పను నేను కూడా లోపలికి రాను అని బాలు అంటాడు. మీనా నేను తాగినందుకు నువ్వు కోపంగా ఉన్నావా అని బాలు అడుగుతాడు.. అది ఫారిన్ సరుకు నాకైతే ఎక్కువగా ఎక్కలేదు వాళ్ళిద్దరికీ బాగా ఎక్కింది అందుకే పడుకున్నారు నాకు దిగిపోయింది అని బాలు అంటాడు. నిద్ర పట్టడం లేదు మీనా? ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం అని అనగానే మీనా కూడా సరే అంటుంది.
Also Read :మాధవ్ కోసం మహా నిర్ణయం.. శైలుకు మరో షాక్.. కేశవ దెబ్బకు చక్రీ ఫ్యూజుల్ అవుట్..
బాలు ఫోన్ ని ఎలాగైనా కొట్టేయాలని వచ్చిన రోహిణి వీళ్లిద్దరు ముచ్చట్లు చూసి కోపంగా ఉంటుంది.. ఏంటి వీళ్లిద్దరూ రాత్రంతా ఇలాగే ముచ్చట్లు పెట్టుకునేలా ఉన్నారు.. ఆ ఫోన్ మనోజ్ కోర్టులో ఉంది ఎలా కొట్టేయాలి ఆలోచిస్తూ రోహిణి మళ్లీ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడే రోహిణికి విద్య ఫోన్ చేసి ఆ ఫోన్ కొట్టేసావా వీడియోని తీసుకున్నావా అని అడుగుతుంది. ఎక్కడ నా బొంద కొట్టేసాను మనోజ్ కోర్టులో ఫోన్ ఉంది మీనా బాలు ఇద్దరు బయటే ఉన్నారు ఎక్కడ కొట్టేయాలి అని అడుగుతుంది.. తాగిన ఇంకా బాలు పడుకోలేదా అని విద్య అంటుంది.. వీరిద్దరూ మాట్లాడుకుంటూ వున్నారు సరసాలు ఆడుతున్నారు అని రోహిణి అంటుంది. వాళ్ళిద్దరూ సరదాగా అలా మాట్లాడుకుంటున్నారు అంటే చాలా బాగుంటుంది కదా ఏం మాట్లాడుకుంటున్నారు అని విద్య అడుగుతుంది. రోహిణి పై విద్యా సీరియస్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..