Gundeninda GudiGantalu Today episode November 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా నగలను తీసుకొనివచ్చి అక్కడ పెట్టగానే మనోజ్ ప్లేస్ మారతాడు. ఏంట్రా లక్షలు మింగినోడా దొంగగా మారి పెళ్ళాం పక్కన నుంచి తల్లి పక్కకు చేరావా అని అంటాడు బాలు. గిల్టు నగల గురించి నాకు ఈ మొన్నే తెలిసింది నాన్న కానీ నేను నా మనసులోని దాచుకున్నాను అని బాలు అంటాడు.. మీనా అనగానే ప్రభావతి ప్లేటు ఫిరాయిస్తుంది.. నువ్వు గిల్టు నగలు కాబట్టే మాకు అంత ఈజీగా ఒలిచి ఇచ్చావు అనుకుంటా ఆడవాళ్ళకి బంగారు మీద మోజు ఉండకుండా ఉండదు అని రివర్స్ అవుతుంది.. ఏం మాట్లాడుతున్నారు మర్యాదగా మాట్లాడండి మా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని మీనా అంటుంది.
నువ్వే కావాలని ఆ నగలని మీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు గిల్టు నగలు ఇక్కడ పెట్టావేమో నాకేం తెలుసు అని ప్రభావతి అంటుంది. మీనా ఎంత చెప్పినా ప్రభావతి వినదు.మర్యాద లేకుండా ఏం మాట్లాడుతున్నావే అని ప్రభావతి అంటుంది.. మీకు ఒక కూతురు కన్న తల్లి. మీకు ఒక అత్తగారు ఉన్నారు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది అని మీనా సీరియస్ అవుతుంది.. నగలని మీ పుట్టింట్లోనే మార్చేసి ఇక్కడకు తీసుకొచ్చావేమో అని ప్రభావతి పదేపదే అంటుంది.. తండ్రి తమ్ముడు ఆస్తిని తినే అంత చండాలపు వ్యక్తులు మా ఇంట్లో లేరు అని మీనా అంటుంది. బాలు మాత్రం ఆ నగలు ఎక్కడ మాయం అయ్యాయో కనిపెడతాను అని బాలు ఛాలెంజ్ చేసి వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి సుశీలను దారుణంగా మాట్లాడుతుంది. సత్యం కొట్టబోతాడు. అందరు షాక్ అవుతారు. ఇక బాలు ప్రభావతికి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. గిన్నెలను విసిరేస్తూ కోపంగా ఉన్న మీనాను చూసి కోపాన్ని వాటి మీద చూపిస్తావేంటి అని అడుగుతాడు. ఆ నగల గురించి నేను అస్సలు వదిలిపెట్టను కచ్చితంగా తేలుస్తాను అని అంటాడు. మీ ఇంట్లో వాళ్లకి ఎవరికి ఏం వచ్చినా ఆ ఇంటి వరకి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మా పుట్టింటి వాళ్ళని అంటే అస్సలు ఒప్పుకునేది లేదు అని మీనా అంటుంది.. శృతి చేత డబ్బింగ్ చెప్పించి మనోజ్ నడిగి నిజాన్ని రాబట్టాలి అని నేనా బాలు ప్లాన్ చేస్తారు.. శృతి రవిని రెస్టారెంట్ దగ్గర కలుద్దామని చెప్పమని బాలుకి మీనా చెప్తుంది..
మనోజ్ కు బాలు శృతి చేత డబ్బింగ్ చెప్పించాలని అనుకుంటాడు.. అవి శృతి ఇద్దరు కూడా బాలు నిర్ణయానికి సపోర్ట్ చేస్తారు.. శృతి ఇంకా ఆత్రుత కనబరుస్తుంది.. ఇది వాడు నగలు కొన్న బిల్లు. వాడు ఈ కవరింగ్ నగలను ఎక్కడ కొన్నాడో తెలుసుకోవాలంటే మనం ఫోన్ చెయ్యాల్సిందే అని బాలు అంటాడు. అయితే ఇప్పుడు ఎవరు ఫోన్ చెయ్యాలి అని రవి అడుగుతాడు. శృతి చేస్తుందని మీనా అంటుంది. ఇది మా ఫ్రెండ్ ఫోన్ మనోజ్ కు కాల్ చెయ్యాలి అని బాలు అంటాడు.. శృతి సరే అన్నా కూడా రవి మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఒకవేళ దొరికిపోతుంది ఏమో అని రవి కంగారు పడుతూ ఉంటాడు.
ఆ మాట వినదని శృతి నువ్వు ఎందుకు ఊరికే కంగారుపడుతూ భయపడుతూ ఉంటావు అని అంటుంది. ఒక దొంగని దొంగ నిరూపించడానికి నేను సపోర్ట్ చేస్తాను అని శృతి అంటుంది. కచ్చితంగా మనోజ్ ఈ పని చేసి ఉంటాడని శృతి కూడా అనుమానం వస్తుంది.. బాలు ఇచ్చిన ఫోన్ తో శృతి మనోజ్ కి కాల్ చేస్తుంది. మేము మీరు షాప్ లో ఉన్న నగలు కొన్నారు కదా మీకు ఒక గిఫ్ట్ వచ్చింది అది మీరు వెళ్లి తీసుకెళ్లండి అని వేరే వారిలాగా మాట్లాడుతుంది. నేనే ఆ నగలు కొన్నానని మీకు ఎలా తెలుసు అని మనోజ్ అడుగుతాడు. మొత్తానికి మనోజ్ దొరికిపోయినట్లే..
Also Read :ఇదేం ట్విస్ట్.. వీల్ చైర్లో మనోజ్..గుండెనిండా గుడిగంటలు కు శుభం కార్డు..?
రోహిణి షాప్ కు వస్తుంది. మనోజ్ గురకపెట్టి నిద్రపోవడం చూసి తల మీద ఒక్కటి ఇస్తుంది. షాప్ లో కస్టమర్స్ ఉంటే నువ్వేంటి ఇలా గురక పెట్టి నిద్రపోతున్నావని అడుగుతుంది. మనసు మాత్రం ఆ నాలుగు లక్షలకు నాకు ఏ సంబంధం లేదు ఆ నగలకి నాకు ఏ సంబంధం లేదు అని అంటాడు. అయినా నువ్వేంటి లేపగానే నాలుగు లక్షలు నాకు సంబంధం లేదు అంటున్నావు నువ్వు ఏమైనా చేశావా అని రోహిణి అడుగుతుంది.. లేదు దాని గురించే ఆలోచిస్తూ పడుకున్నా అలా అన్నాను అని అంటాడు. రోహిణికి కాల్ వస్తుంది. చింటూ ఎందుకు కాల్ చేస్తున్నాడని వాళ్ళ అమ్మని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు అసలు నిజాన్ని బయటపెడతాడు. ఏం జరుగుతుందో చూడాలి..