Illu Illalu Pillalu Today Episode February 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి అక్కడికి వచ్చి నేను ముగ్గు వేయడం నేర్పిస్తాను లెండి అని అంటుంది. అమూల్యని ఎంతగా బతిమిలాడినా సరే నువ్వు చేయడం వలన నా జీవితం ఇలా మారింది అని బాధ పడిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన ప్రేమ ఏం మాట్లాడుతున్నావ్ వల్ల అక్క అని గట్టిగా అరుస్తుంది.. ఏమీ లేదు ముగ్గు వేయడం నేర్పిస్తున్నాను ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను సరిగా చూసుకుంటున్నారా లేదా అని అడుగుతున్నాను అంతే అని ప్రేమ అంటుంది.. ఇక శ్రీవల్లి లోపలికి వెళ్ళగానే ప్రేమ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులను బయట పెట్టొద్దు అని మాట తీసుకుంటుంది.. నువ్వు బాధపడితే ఇంట్లోనే వాళ్ళు కూడా బాధపడతారు.. విశ్వం నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. శ్రీవల్లి సాగర్ ని అడ్డంగా బుక్ చేస్తుంది. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన నర్మదా సాగర్ ని సేఫ్గా బయటపడేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. శ్రీవల్లి సాగర్ ని పిలుస్తుంది. ఆ వనజ గారికి డబ్బులు ఇవ్వమని మీకు చెప్పారు కదా మరి అతను కొత్త జాబు మోజులో పడిపోయి మర్చిపోయినట్లున్నాడు.. మీరు అల్లుడుగారు ఎలాగో డబ్బులు విషయంపై బ్యాంకుకు వెళ్తున్నారు కదా మీరే స్వయంగా వెళ్లి ఆ డబ్బులని వాళ్లకి ఇస్తే బాగుంటుంది కదా అని భాగ్యం అంటుంది నేను ఆ డబ్బులు ఇస్తాను నాన్న అని ఎంతగా అంటున్న సరే భాగ్యం చెప్పిన మాటను విని రామరాజు పాస్ బుక్ ని అడగమని చెందులతో చెప్పాడు. పలు ఉద్యోగస్తులు కదరా మనం మూటలు మూసుకునే వాళ్ళం ఆ డబ్బులని మనమే తెచ్చి ఇద్దామని రామరాజు అంటాడు కానీ సాగర్ భయపడిపోతూ ఉంటాడు అప్పుడే సీన్లోకి ఎంటర్ అయిన నర్మదా అతనికి ఇచ్చిన బాధ్యతని అతనే పూర్తి చేస్తాడు అని రామరాజుతో అంటుంది…
సాగరు అయోమయంగా ఉండడంతో శ్రీవల్లి భాగ్యంకి ఒక డౌట్ వస్తుంది. ఏంటి ఇతను ఏమైంది కచ్చితంగా 20 లక్షలు లేనట్టే ఉన్నాయి అని వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇక లోపలికి వెళ్ళగానే సాగర్ నర్మదను 20 లక్షలు ఎక్కడ నుంచి తీసుకురావాలి నాకు చాలా కంగారుగా ఉంది అని అడుగుతాడు.. నువ్వు ప్రస్తుతం ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించావు. కానీ 20 లక్షలు ఎక్కడినుంచి పెట్టాలి నాకు అర్థం కావట్లేదు అని సాగర్ అంటాడు. మీ నాన్నని మోసం చేసి 20 లక్షలు తీసుకున్నప్పుడు నీకు అనిపించలేదా..? ఇప్పుడు 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తామని అంటే నర్మదా తన నగలని బయటకు తీస్తుంది.
ఇప్పుడు నువ్వు ఈ నగలని ఎందుకు తీస్తున్నావు.. ఇది తప్ప ఇప్పుడు మనకు వేరే పరిస్థితి లేదు ఈ నగలను తాకట్టు పెట్టేసి మనం 20 లక్షలు తీసుకురావాలి. ఆ తర్వాత నేను జాబ్ మీద లోన్ పెట్టుకొని నగలను బయటకు తీసుకొస్తాను అని అంటుంది. థాంక్స్ నర్మదా నువ్వు నన్ను కాపాడావు నా ప్రాణాలని పోకుండా చేశావు అని సాగర్ అంటారు.. అయితే ఆ నగలను తీసుకొని దొంగ చాటుగా వెళ్లిపోవడం చూసిన ఆనందరావు నర్మదా ఏదో పైట కింద దాస్తుంది వెంటనే ఈ విషయాన్ని భాగ్యంతో చెప్పాలని అనుకుంటాడు. ఇక తీరొచ్చు తన కారు ఓనర్ తో ఎంతగా బ్రతిమలాడి మాట్లాడినా సరే అతను మాత్రం నువ్వు చేసింది తప్పే అని అంటాడు.
Also Read :‘బ్రహ్మముడి’ సీరియల్ కు శుభం కార్డు.. ఊహించని ట్విస్ట్..
మీ నాన్న గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ నేను పెద్దగా నమ్మలేదు ఇప్పుడు చూస్తుంటే ఆయనకు పిల్లల్ని పెంచడం కూడా రాదని అర్థమవుతుంది అని అనగానే రెచ్చిపోతాడు. ఆ కార్ ఓనర్ ధీరజ్ గొడవకు దిగుతాడు.తన ఫ్రెండ్స్ ధీరజ్ని కాపాడి బయటకు తీసుకొని వస్తారు. ఇక నర్మదా సాగర్ వెళ్లిన విషయాన్ని భాగ్యం శ్రీవల్లి తో చెప్తాడు ఆనంద్ రావు.. పనుల్లారని అలానే ఉంటావేంటి వాళ్ళని వెళ్లి ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్లారు ఏం.. నువ్వు నగల షాప్ కి వెళ్ళిన వీళ్లిద్దరూ అక్కడ తమ నగలను పెట్టి డబ్బులు కావాలి అని అడుగుతారు అది చూస్తున్న ఆనందరావు షాక్ అవుతాడు.. అయితే నగలను పెట్టి డబ్బులు తీసుకున్న విషయాన్ని ఆనందరావు పసిగట్టేస్తాడా లేదా అన్నది ఎపిసోడ్ లో చూడాలి ఇక్కడితో అయితే ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ మాత్రం కాస్త హైలెట్గా నిలవాలని ఉందని తెలుస్తుంది..