Brahmamudi Serial : ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో స్టార్ మా సీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సీరియల్ కూడా పోటీపడి ప్రేక్షకులను తమ స్టోరీ ఏదో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని సీరియల్స్ రివెంజ్ డ్రామా తెరకెక్కితే మరికొన్ని సీరియల్స్ మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నయో నిత్యం మనం చూస్తూనే ఉంటాము.. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ మొదట్లో మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది.. కానీ ఈమధ్య స్టోరీ చాలా వీక్ గా ఉండడంతో జనాలు దీనిని చూడడం మానేసి కొత్త సీరియల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన సీరియల్స్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకోవడంతో ఈ సీరియల్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. బ్రహ్మముడి సీరియల్ మరికొద్ది రోజుల్లో శుభం కార్డు వేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ మారింది.. నిజంగానే ఈ సీరియల్ శుభం కార్డు వేసుకోబోతుందా లేదా అన్నది ఒక్కసారి మనం క్లియర్ గా కనుక్కుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఒకప్పుడు మంచి రేటింగ్ ని సొంతం చేసుకున్న సీరియల్ బ్రహ్మముడి.. ఒకసారి బ్రహ్మముడి ఓ జంటకు పడితే వాళ్ళు కట్ట కాలే వరకు కలిసి ఉంటారు అన్న స్టోరీ తో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే మొదట్లో సీరియల్ రేటింగు అమాంతం పెరిగింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ మరోవైపు.. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అప్పట్లో జనాలని అమాంతం ప్రభావితం చేసింది.. కానీ ఈమధ్య స్టోరీ కాస్త చాలా వీక్ అయినట్లు తెలుస్తుంది.. మీరు విన్నది అక్షరాల నిజం. రాజు కావ్యాలకు పిల్లలు పుట్టరు అన్న అప్పటినుంచి వాళ్ళ పిల్ల పుట్టిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్నది జనాలకు కాస్త బోరింగ్ గా అనిపించింది. దాంతో ఈ సీరియల్కు మరికొద్ది రోజుల్లో శుభం కార్డు వెయ్యబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదే కనుక నిజమైతే ఈ సీరియల్ ప్లేస్లోకి మరో కొత్త సీరియల్ వచ్చే అవకాశం కూడా ఉంది.
దుగ్గిరాల కుటుంబంలోని వారసుడు రాజ్.. ఓ పేరేంటి బొమ్మలు తయారు చేసుకునే అమ్మాయి కావ్య.. అనుకోని పరిస్థితులలో రాజు కావ్య వాళ్ళ అక్కని ప్రేమిస్తాడు.. ఆమె ఆ ఇంటికి కోడలు కాకూడదు అని ఆ ఇంట్లో తన మేనత్త కొడుకు రాహుల్ స్వప్నని లేపుకెళ్తాడు.. ఇక రాజు తప్పని పరిస్థితులలో కావ్య మెడలో తాళి కడతాడు. ఆ తర్వాత తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో రాజు కావ్య అని చాలా రోజులు దూరం పెడతాడు. అనుకూరి పరిస్థితులు అలా వాళ్ళిద్దరినీ దగ్గర చేస్తాయి. అంతే కాదు చివరికి ఇంట్లోని వాళ్ళందరినీ కూడా కావ్య మార్చేస్తుంది. ప్రస్తుతం రాజు కావ్యాలకు పాప పుడుతుంది. ఆ పాపని ఎలాగైనా సరే దూరం చేసి ఆస్తిని తన కొడుకు దక్కాలని చూస్తుంది రుద్రాణి.. ప్రస్తుతం రుద్రాణి ఆస్తి కోసం అప్పు కళ్యాణి కూడా కిడ్నాప్ చేస్తుంది. వాళ్ళిద్దర్నీ రాజు కావ్య కాపాడడంతో పాటుగా రుద్రాణిని కావ్య చెప్పుతో కొడుతుంది. ఇక రుద్రాణి బయటకు వెళ్తే మాత్రం ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అని నెట్టింటా ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇదే నిజమైతే స్టార్ మా లో మరో కొత్త ఛానల్ రాబోతుందని సమాచారం..