Intinti Ramayanam Today Episode july 21st: పల్లవికి రెండు రోజులు టైం ఇచ్చిన సరే ఇంకా ఇంతగా రెచ్చిపోతుంది. ఎలాగైనా సరే మరోసారి వార్నింగ్ ఇవ్వాలి అని అవని అనుకుంటుంది.. అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తుంది అవని.. ఆ నగలని వాడు ఏం చేశాడో కనుక్కోవాలి అని పల్లవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చినా మీనాక్షి పల్లవి గురించి ఎమోషనల్ మాట్లాడుతూ ఉండగా పల్లవి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కోపంగా ఉంటుంది. నన్ను ఇరికించాలని చూసావు కానీ నీకు డబ్బులు అవసరమైతే నేను మీ నాన్నని అడిగి ఇప్పిస్తాను కదా అని మీనాక్షి అనగానే తనని దారుణంగా అవమానిస్తుంది.. నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ పల్లవి మీనాక్షి కి వార్నింగ్ ఇస్తుంది. మీనాక్షి పల్లవి మాటలు విని బాధపడిపోతూ ఉంటుంది..
పల్లవి మాటలు విన్న మీనాక్షి తన కూతురే ఇలా మాట్లాడుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక శ్రీయ బాబు ఇంకా నిద్రపోలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకర్ శ్రీయ ఇద్దరు కూడా పాపతో మాట్లాడుకుంటూ ఉంటారు. బాబు ఇంకా నిద్ర పోలేదా ఏంటి అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉండడం వీళ్లిద్దరూ ఎలా వాడిని నిద్రపించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బాబు నిద్రపోవడానికి నేను కథలు చెప్తా నీ ఒకరు నేను కథలు చెప్తానని ఒకరు ఇద్దరు కూడా పోటీపడి మరి సరదాగా బాబుతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆరాధ్య వచ్చి బాబు ఇంకా నిద్ర పోలేదా అని అడుగుతుంది.. ఇంకా బాబు నిద్రపోలేదు ఆరాధ్య వాళ్ళు అనగానే నేను నిద్ర పుచ్చుతాను అని తను జోలపాడి మరీ బాబుని నిద్ర పిస్తుంది..
కమల్ ఎక్ససైజ్ చేస్తూ కష్టపడి పోతూ ఉంటాడు. అయితే ఈ టైంలో ఫీడ్ ఏంటి? వన్ టూ త్రీ నేర్చుకుంటున్నాడు. ఈ వయసులో వీడికి అవసరమా అంటూ భానుమతి అక్కడికి వస్తుంది.. ఈ వయసులో ఇదేం పనిరా ఇప్పుడు ఎందుకు నువ్వు ఈ రాత్రి టైం లో ఎక్ససైజ్ చేస్తున్నావో అని అడుగుతుంది. నేను ఎక్సర్సైజులు చేయడానికి చాలా కారణం ఉందిలే. నువ్వు ఎందుకు ఇలా వచ్చావు నువ్వు వెళ్ళు అర్జెంటుగా అని కమల్ అంటాడు.. అప్పుడే రూమ్ లోకి వచ్చిన పల్లవి కమల్ ని చూసి షాక్ అవుతుంది. నీ మనవరాలు వచ్చేసింది గా అని కమల్ సెంటు కొట్టుకుంటూ కనిపిస్తాడు.. భానుమతి మీ తాతయ్య కూడా ఇలానే సెంటు కొట్టుకొని వచ్చేవాడు.. నీకు పల్లవికి రాత్రంతా చుక్కలే అని భానుమతి ఆలోచిస్తూ ఉండగా.. పల్లవి మాత్రం ఈ టైంలో సెంటు ఎందుకు కొట్టుకుంటున్నావ్ నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని అంటుంది.. కమల్ ఎంతగా దగ్గరికి వెళ్లాలని చూసినా సరే పల్లవి మాత్రం తనని తోసేస్తూ మూడ్ లేదు అంటూ అరుస్తుంది..
పల్లవి ఇలా ఉంటే పిల్లలు ఎలా పుడతారు అని ఆలోచిస్తుంది. వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే దగ్గర చేయాలి అని భానుమతి ప్లాన్ చేస్తుంది. పాలల్లో మత్తుమందు కలిపి ఇవ్వగానే ఆ పాలని తీసుకొని వెళ్ళిన తర్వాత పల్లవి అమ్మమ్మ నాకోసమే తెచ్చింది అని పాలు మొత్తం తాగిస్తుంది.. అది చూసి రా భానుమతి మొత్తం తాగేసింది ఇక రాత్రంతా వీళ్ళకి జాగారం ఏంటో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి ఆ మత్తులో రెచ్చిపోతుంది.. కమల్ ని ఇంకాస్త రెచ్చగొట్టి రొమాన్స్ చేస్తుంది. పల్లవి పెట్టిన ముద్దుకి కమల్ ఫిదా అయిపోతాడు. మొత్తానికి భానుమతి ప్లాన్ తో కమల్ పల్లవి ఇద్దరు ఒక్కటవుతారు..
ఉదయం లేవగానే శ్రీయా అందరిని రమ్మని పిలుస్తుంది.. అయితే ఏమైంది శ్రేయ ఎందుకు అందని రమ్మని పిలిచావని చెప్పగానే.. ఆగండి అత్తయ్య మీకోసం నేను ఒక ప్లాన్ చేశాను ఆవిడ వస్తుంది అని చెప్పగానే.. ఎవరు ఆవిడని అందరూ ఎదురు చూస్తూ ఉండగా శ్రీ ఆ మాత్రం టీచర్ అని పిలవగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.. అక్కడికి వచ్చిన యోగా టీచర్ని చూసి అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. శ్రీ అ కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా వాళ్ళు మాత్రం యోగ ఆసనాలు చేయలేక అక్కడి నుంచి ఒక్కొక్కరిగా మెల్లగా జారుకుంటారు. పల్లవికి మాత్రం కోపం తగ్గేందుకు ఇచ్చిన ఆసనం ఫెయిల్ ఈ పల్లవి కింద పడిపోతుంది అందరూ నవ్వుతారు.. ఇక ఒక్కొక్కరు యోగా నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?