Intinti Ramayanam Today Episode April 14th: అవని హారతి ఇచ్చి రాజేశ్వరిని లోపలికి తీసుకుని వస్తుంది. అయితే లోపలికి వెళ్లి అందరూ కూర్చోగానే రాజేశ్వరికి జ్యూస్ కావాలి అని అవని అడుగుతుంది.. నేను నీతో మాట్లాడాలి అని అవని రాజేశ్వరి లోపలికి తీసుకుని వెళుతుంది.. అయితే పల్లవి ఎందుకు అవనేని లోపలికి తీసుకొని వెళుతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. మళ్లీ వీళ్ళిద్దరూ కలిసిపోయారా ఏంటి అని తెలుసుకోవాలని తలుపు దగ్గర చాటుగా వినాలని అనుకుంటుంది..నేను హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకున్నాను భరత్ నా కొడుకు అని తేలింది.. అయితే నాకు ఇప్పుడు నా కొడుకు కావాలి పాతికేళ్లు పెంచుకున్న నా కూతురు కావాలి అని రాజేశ్వరి అంటుంది.. మీరు ఎలాగైతే మీ కొడుకుని కావాలి అనుకున్నారు మా అమ్మ కూడా మీ కొడుకుని అంతకంటే ఎక్కువ ప్రేమగానే చూసుకుంది.. ఈ విషయం గురించి నేను మాట్లాడాలి అంటే నాకు కొంచెం టైం కావాలి అని అవని అంటుంది. అక్షయ అవనీలు ఇంటికి బయలుదేరుతారు..
అవని వెళ్లిన తర్వాత పల్లవి రాజేశ్వరి దగ్గరికి వచ్చి మామ్ ఎందుకు ఇలా చేశావు మామ్ అని అడుగుతుంది. నువ్వు ఇలా చేయడానికి కారణం ఎవరు అన్నది నాకు తెలుసు కానీ నీకు వాళ్ళు ఎవరూ లేకపోయినా నేనున్నాను కదా నా కోసమేనని ఆలోచించాలి కదా అని పల్లవి అడుగుతుంది. నేను నీకున్న నన్ను సంగతి నువ్వు మర్చిపోవద్దు మామ్. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని పల్లవి ఎమోషనల్ అవుతుంది. తన కూతురు కాకపోయినా పల్లవిని తన సొంత కూతురు లాగా చూసుకున్న రాజేశ్వరి నీ కోసం నేను ఎప్పుడూ ముందుంటానమ్మా అని మాట ఇస్తుంది. అక్కడికి వచ్చిన కమల్ మీరు ఎప్పుడు ఇలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అని అంటాడు.
రాజేశ్వరికి దగ్గర నుంచి అవని అక్షయలు బయలుదేరుతారు. కొంత దూరం వచ్చిన తర్వాత అక్షయ్ బండిని పక్కకు ఆపి అవన్నీ తో మాట్లాడాలి అని అనుకుంటాడు. మీ పిన్ని లోపలికి పిలిచే ఏదో మాట్లాడింది. అప్పటినుంచి నీళ్లు నువ్వు లేవు ఏమి అడిగింది ఏం జరిగింది అని అక్షయ్ అవనిని అడుగుతాడు. అవని ఏం జరగలేదు అని ఎంత చెప్పినా సరే అక్షయ్ వినకపోవడంతో అసలు నిజాన్ని బయట చెప్తుంది. భరత్ నీ నాకు వెంటనే నాకు ఇవ్వు అని పిన్ని అడుగుతుంది కానీ ఈ విషయం గురించి మా నాన్న ఏం మాట్లాడడం లేదు అని అవని అంటుంది. మా అమ్మకి సద్ది చెప్పి ఆమెను కూడా ఒప్పించాలి కదా అని అనుకుంటుంది. వీరిద్దరూ మాట చెప్పే విని రకం కాదు అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వేం బాధపడకు అవని. ముందు మీ నాన్నకి విషయం చెప్పి ఆయనను ఒప్పించి అత్తయ్య దగ్గరికి పంపిద్దాము. అప్పుడు సాల్వ్ అవుతుంది అని అక్షయ్ అంటాడు..
అవని ఒకటే కూర్చుని ఆలోచిస్తూ ఉండగా పల్లవి అక్కడికి వస్తుంది. మా అమ్మని నాన్నని ఎలాగైతే దూరం చేసావో ఇప్పుడు మా అమ్మ చనిపోవడానికి కూడా కారణం నువ్వే అని అంటుంది. నువ్వు మీ అమ్మ ఆడిన నాటకంలో మా అమ్మబలైపోయింది అని పల్లవి దారుణంగా మాట్లాడుతుంది. ఎంత చెప్తున్నా సరే వినకుండా మాట్లాడడంతో అవని ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చి నాకు కమల్ మా వదినని ఒక్క మాటంటే ఒప్పుకునేది లేదు అని పల్లవి నీ కొట్టడానికి చెయ్యెత్తుతాడు కానీ అవని మాత్రం ఆడపిల్లని కొట్టడం సంస్కారం కాదు అని కమల్ ని కంట్రోల్ చేస్తుంది.
భరత్ నీ ఎలాగైనా సరే తన దగ్గరికి తెచ్చుకోవాలి అని రాజేశ్వరి తన ఫ్రెండ్ నీలిమకు చెప్పి భరత్ గురించి వివరాలను తెలుసుకోమని చెప్తుంది. అతన్ని నా దగ్గరికి తీసుకుని తెచ్చుకోవడానికి నేను కొన్ని చేయాలి కదా అందుకే నీకు ఈ పని చెప్తున్నాను. నువ్వు ఏమనుకోకుండా వెంటనే చేసిన కు చెప్పాలి అని అడుగుతుంది. భరత్ నీ ఎలాగైనా సరే నా దగ్గరికి తెచ్చుకుంటాను అని రాజేశ్వరి తన ఫ్రెండ్ తో చెప్తుంది. ఇక భరత్ చక్రధర్ చేస్తున్న పనులకు షాక్ అవుతాడు. తండ్రి అని కూడా చూడకుండా తిడతాడు. మీనాక్షి ఎంత చెప్తున్నా సరే తను మాత్రం చక్రధర్ ఇంట్లో ఉండడానికి ఇష్టపడడు.
శ్రేయ పల్లవిని కాఫీ అడిగితే ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. మొత్తానికి ఆ రచ్చ నుంచి బయటపడి అవని అక్షయలు చక్రధర్ ని కలవడానికి బయటకు వెళ్తారు.. అయితే చక్రధర్ రాగానే మీరు పిన్ని దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది అని అవని ఎంత చెప్పినా సరేం. తాను మాత్రం నేను ఈ ఒక్క కోరికను తీర్చలేనమ్మ నన్ను ఏమీ అనుకోవద్దు అని అంటాడు. భరత్ నీ పిన్ని ఇచ్చేయమని అడుగుతుంది కానీ ఇప్పుడు అమ్మ ఉన్న పరిస్థితులు అలా చేయడం కష్టమని ఎంత చెప్తున్నా సరే చక్రధర్ మాత్రం నేను వినను అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో శ్రేయ అవనితో పెద్ద గొడవకే దిగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :మహాలక్ష్మీ తెలుగు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? డైలాగ్ అదరగొట్టిందిగా..