Intinti Ramayanam Today Episode December 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య ఎక్కడుంది అమ్మ తీసుకొని రా అనేసి అవనితో రాజేంద్రప్రసాద్ అంటాడు.. అయితే మధ్య దగ్గరికి వెళ్లి అవని లేకపోతే తను అమ్మ అంటూ కలవరిస్తూ భయపడిపోతూ ఉంటుంది. తనకి జ్వరం కూడా ఉండడంతో ఆరాధ్యకు బాగా జ్వరం వచ్చింది డాక్టర్ని తీసుకురావడానికి బయటకు వెళ్తారు.. కానీ ఏక లింగం చెప్పిన మాటలు విని ఆ డాక్టర్ రావడానికి నిరాకరిస్తాడు. అక్షయ్ నాకు అర్థమైంది నేను వెళ్లి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని బయటికి వెళ్లిపోతాడు. అక్షయ్ టాబ్లెట్స్ కోసం ఎంతగా వెతికినా సరే అక్కడ ఎవరూ టాబ్లెట్స్ ఇవ్వడానికి ఒప్పుకోరు.. ఊర్లో ఉన్న మెడికల్ షాపులను నేను చూపిస్తానని ఏకలింగం మనిషి అక్షయతో పాటు వెళ్తాడు. కానీ అక్షయ్ వెనకాల ఉన్న వ్యక్తి ఏ మెడికల్ షాప్ కు వెళ్ళినా ఇవ్వద్దు అని సైగలు చేస్తాడు. దాంతో ఎవరు కూడా భయపడి ఇవ్వరు. అక్షయ ఊరంతా తిరిగినా కూడా అక్కడ మందులు దొరకపోవడంతో బాధపడతాడు. తన కూతురికి ఏమన్నా అవుతుందని ఆలోచిస్తూ చివరిగా ఉన్న షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏకలింగం మనిషి మందులు ఇవ్వద్దని చెప్పడం చూసిన అక్షయ్ అతనిని చావగొట్టి మందులు తీసుకుని వెళ్తాడు. కానీ కోటిలింగం అప్పటికే ఆరాధికి మందులు తెచ్చి ఇచ్చి తనకు జ్వరం లేకుండా చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..రాజేంద్రప్రసాద్ కుటుంబం ఊర్లో వాళ్ళ అందరితో మాట్లాడి పిల్లలని స్కూల్ కి పంపించమని అడుగుతారు.. స్కూల్ పనులు పూర్తవ్వగానే పిల్లలందరూ స్కూల్లో వచ్చి చదువుకుంటారు. ఆ తర్వాత హాస్పిటల్ ని కూడా మొత్తం మార్చేసి పేషంట్లకు మంచి సదుపాయాలను ఇవ్వాలని అనుకుంటారు.. అంతేకాదు ఒక డాక్టర్ ని కూడా సిటీ నుంచి పల్లెటూరికి తీసుకొని వస్తారు. ఈ విషయాన్ని ఏకలింగం మనిషి ఏక లింగానికి చెప్తాడు.. అవని ఊర్లో ఉన్నావ్ వాటన్నిటిని బాగు చేసి మంచి చేస్తే తన ఇమేజ్ తగ్గిపోతుంది అని ఏక లింగం తనపై ఎలాగైనా సరే గెలవాలని అనుకుంటాడు. అవి నీకు ఏదో ఒకటి చేసి ఈ ఊరు నుంచి తరిమేయాలని అనుకుంటాడు.
అక్షయ్ అవని మాత్రం ఈ ఊరికి మంచి చేసి ఆ ఏకలింగం పీడని వదిలించాలి అని అనుకుంటారు. ఊర్లో ఉన్న పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకు కంగారుగా ఉంది వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని అంటుంది. ఇక స్కూలు హాస్పిటల్ భాగవతంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఊరికి మనం వచ్చిన పని దాదాపు పూర్తవుతుంది ఇక మన ఆస్తులు గురించి మాత్రమే మాట్లాడాలి అని అనుకుంటారు..స్కూల్లో పిల్లలు ఎలా ఉన్నారు అని రాజేంద్రప్రసాద్ కుటుంబం అక్కడికి వెళ్లి చూస్తారు.. ఎలాగైతే ఊహించుకున్నారో అలానే ఆ స్కూల్ ఉండడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఇక తర్వాత ఈ స్కూల్లో నాకు నా తల్లి ఒడిలో ఉన్నట్లు అనిపిస్తుంది అని అక్షయ్ అనుకుంటాడు. నా తల్లి పేరు మీద ఉన్న ఈ స్కూల్ కి మంచి పేరు తీసుకొచ్చేలా విద్యార్థులను తయారు చేయాలి అని అనుకుంటాడు. ఇలాంటి మంచి స్కూల్లో పిల్లలందరూ ఉన్నత స్థాయికి వెళ్లాలని నా కోరిక అని అక్షయ్ అంటాడు. అవని మీ కోరిక తప్పక నెరవేరుతుంది మీరు ఏమి బాధపడకండి అని అంటుంది..
ఆరాధ్య ఇది మీ అమ్మ పేరు మీద ఉన్న స్కూల్ కదా నాన్న.. నేను ఇదే స్కూల్లో చదువుతాను అని అడుగుతుంది. మనం ఇదే ఊర్లో గనక ఉంటే ఈ స్కూల్లో నేను చదువుదువు అని అక్షయ్ అంటాడు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ నాకు ఏదో సర్ప్రైజ్ ఉందని అన్నావు కదా అమ్మ ఏంటి ఆ సర్ప్రైజ్ అని అడుగుతాడు.. అవును మావయ్య గారు మీకు ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని అవని అక్కడికి వెళుతుంది.. ఇదేంటమ్మా పాత మిత్రుల కలయిక అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు.. అది మావయ్య మీరు మీ మిత్రుల్ని కలుసుకొని ఆ ఆనందచనాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను ఇలా ప్లాన్ చేశాను. బాబాయ్ గార్లు రండి అని అవని రాజేంద్రప్రసాద్ స్నేహితులను పిలుస్తుంది..
రాజేంద్రన్ చూసిన వాళ్ళ స్నేహితులు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా తన స్నేహితులను చూసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనందంగా ఉంటాడు. వాళ్ళందరూ కూడా తమ కొడుకులు కోడళ్ళు, వదిలేసి విదేశాల్లో ఉన్నారని చెబుతారు. రాజేంద్రప్రసాద్ మాత్రం నా కుటుంబం నా కొడుకులందరూ నాతోనే ఉన్నారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అంటారు. ఇలాంటి మంచి జీవితాన్ని గడపడానికి కారణం నా కోడలు అవలేనేని పొగిడేస్తారు.. తర్వాత ఆ ఊరి ప్రజలతో కలిసి ఒక చిన్న ఈవెంట్ లాంటిది నిర్వహిస్తుంది అవని. అది చూసి ఓవ లేకపోయినా పల్లవి ఏక లింగానికి అవని తల్లి గురించి చెబుతుంది. ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ఊర్లోని ఇద్దరు ఆడవాళ్లు ఏక లింగం చెప్పినట్లు చేస్తారు.
Also Read:బాలు, మీనా రొమాన్స్.. పోటీలో ఓడిపోయిన మీనా.. మనోజ్ కు నిజం తెలిసిపోతుందా..?
తండ్రి ఎవరో తెలియని నువ్వు మా పిల్లలకి విద్యాబుద్ధుల గురించి చెప్తున్నావా ఎలా ఉండాలో నేర్పిస్తున్నావా అని అంటారు. అక్రమంగా ఎవరికి పుట్టిందో తెలియని ఇలాంటి ఈవిడ నా పిల్లలకి చెప్తే వాళ్లు కూడా చనిపోయి ఇలానే తయారవుతారు అని అక్కడున్న ఆడవాళ్లు అవన్నీ నీ దారుణంగా అవమానిస్తారు. అవని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఏక లింగం ని అక్షయ్ కొడతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..