E-Paper
Advertisement

ACCA Ban Exam: కొంపముంచిన ఏఐ.. ఆన్‌లైన్ పరీక్షా విధానం రద్దు చేసిన అతిపెద్ద అకౌంటింగ్ సంస్థ

ACCA Ban Exam: కొంపముంచిన ఏఐ.. ఆన్‌లైన్ పరీక్షా విధానం రద్దు చేసిన అతిపెద్ద అకౌంటింగ్ సంస్థ
Advertisement

ACCA Ban Online Exam| ఏఐ టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ నష్టాన్ని చూస్తూ చాలా సంస్థలు భద్రత కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ కోవలో తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ACCA) నిలిచింది. యుకె కు చెందిన ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.6 లక్షల మంది సభ్యులు, 5 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ సంస్థ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

AI మోసాలు పెరిగిపోవడంతో ఆన్‌లైన్ పరీక్షలపై బ్యాన్

ACCA చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెలెన్ బ్రాండ్ ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో విద్యార్థులు చేస్తున్న మోసాలు నియంత్రించడం చాలా కష్టమవుతోందని చెప్పారు. ఆన్‌లైన్ పరీక్షల్లో నమ్మకం, న్యాయం ఉండటం కష్టమైందని అన్నారు.

మార్చి 2026 నుంచి కొత్త నియమాలు అమలు

Advertisement

మార్చి 2026 నుంచి ACCA పరీక్షలన్నీ ఆఫ్ లైన్ మోడ్ లో సెంటర్లలో వ్యక్తిగతంగా రాయాలి. ఆన్‌లైన్ పరీక్షలు కేవలం చాలా అరుదైన, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. సెంటర్లలో పరీక్షలు రాస్తే భద్రత బాగుంటుందని, మోసాలు తగ్గుతాయని ACCA భావిస్తోంది.

కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం

కోవిడ్-19 మహమ్మారి సమయంలో లాక్‌డౌన్‌ల వల్ల ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణం కష్టమైంది. అందుకే ACCA ఆన్‌లైన్ పరీక్షలు ప్రవేశపెట్టింది. రిమోట్ ఇన్విజిలేషన్ సాయంతో విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలు రాసి క్వాలిఫికేషన్ పూర్తి చేశారు. అప్పటి ఎమెర్జెన్సీ లాంటి పరిస్థితుల్లో ఈ పరిష్కారం అందరికీ ఉపయోగపడింది.

AI వల్ల సులువుగా మోసాలు, గుర్తించడం కష్టం

Advertisement

ఇప్పుడు AI సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందింది. మోసాలు చేసే విధానాలు చాలా అధునాతనంగా మారాయి. పరీక్ష సమయంలో ప్రశ్నల ఫోటోలు తీసి AI చాట్‌బాట్‌లో వేసి సమాధానాలు తెచ్చుకోవడం జరుగుతోంది. ఇలాంటి సంఘటనల వల్ల పరీక్షల నమ్మకత్వం ప్రశ్నార్థకమైంది.

అకౌంటింగ్ రంగంలో మోసాల స్కాండల్స్

ప్రపంచంలోని పెద్ద అకౌంటింగ్ కంపెనీలు PwC, KPMG, Deloitte, EYలు మోసాల కేసుల్లో జరిమానాలు చెల్లించాయి. 2022లో EY అమెరికాలో 100 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించింది. ఇవి సంస్థల అంతర్గత పరీక్షలకు సంబంధించినవి అయినా.. అకౌంటింగ్, ఆడిటింగ్ రంగం మొత్తం ప్రభావితమైంది.

Also Read: చలికాలంలో రూం హీటర్లతో అగ్నిప్రమాదాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

విద్యార్థులపై ప్రభావం

ఆన్‌లైన్ పరీక్షలు చాలా మంది విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేవి. దూరంగా ఉండే వారు, గర్భిణులు ఇబ్బంది పడకుండా రాసేవారు. కానీ ACCA పరీక్షల నమ్మకత్వాన్ని ముందుంచి ఈ నిర్ణయం తీసుకుంది.

ACCA కోర్సు నిర్మాణంలో మార్పులు

ACCA తన కోర్సును కూడా అప్డేట్ చేస్తోంది. AI, బ్లాక్‌చైన్, డేటా సైన్స్ అంశాలు జోడిస్తోంది. భవిష్యత్ అకౌంటెంట్లు నిజ జీవిత పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలని హెలెన్ బ్రాండ్ చెప్పారు.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×