Intinti Ramayanam Today Episode February 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఉద్యోగం చేయాలని ఇంటర్వ్యూ కి వెళ్తుంది ఎన్ని ఆఫీసులు తిరిగినా తనకి ఇంట్లో వాళ్ళ షూరిటీ అన్న కనీసం భర్త శూరిటీ అన్న ఇవ్వాలని అంటారు. చివరికి ఓ ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఉద్యోగం ఇస్తామని అంటారు కానీ చక్రధర్ ఫోన్ చేయడంతో ఉద్యోగం ఇవ్వడం కుదరదని అతను చెప్తాడు దాంతో నిరాశతో బయటికి వచ్చిన అవనీకి చక్రధరి పల్లవిల్లు కనిపించడంతో ఇదంతా వీరి పని అని అనుకుంటుంది. ఇక ఇద్దరూ కలిసి పెద్ద యుద్ధమే చేసుకుంటారు మధ్యలో మా తండ్రి గ్రేటు మా తండ్రి గ్రేటు అని చెప్పుకుంటారు ఇక తల్లిని పక్కన పెట్టుకొని ఇద్దరు గొడవ పడటంతో చక్రధర్ ఫీల్ అయిపోతాడు.. మీరు ఎన్నిసార్లు నన్ను తొక్కేయాలని చూసినా కూడా దేవుడనేవాడు ఉంటాడు ఏదో ఒక రోజు నాకు న్యాయం జరిగేలా చూస్తాడు అనేసి అవని పల్లవి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తుంది. ఇక అవని బయట బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. బస్సు కోసం చూస్తున్నావా నేను చూసి ఇద్దరు రౌడీలు అల్లరి చేయాలని చూస్తారు. బస్టాప్ లో ఉన్న వాళ్ళని ఈరోజు బస్సులు రావట్లేదు వెళ్లండి అని పంపించేస్తారు. అవని నీ రౌడీలు ఇద్దరు నువ్వు చాలా బాగున్నావు నెంబర్ ఇస్తావా ఎప్పుడు కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం అనేసి ఆట పట్టిస్తారు. వాళ్ళ మాటలకు కోపంతో రగిలిపోయిన అవని వాళ్ళని చంప పగలగొడుతుంది. మమ్మల్ని కొడతావని ఆ రౌడీలు మళ్ళీ కొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ అప్పుడే అక్షయ అక్కడికి వచ్చి ఏ మిస్టర్ ఆమె ఎవరనుకుంటున్నారు నా భార్య అనేసి చితక్కొడతాడు. అవని బాధను చూసి దయాకర్, స్వరాజ్యం రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చి దుమ్ము దులిపేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనకి నిజం చెప్పదు మనం వెళ్లి డైరెక్టుగా ఆ రాజేంద్రప్రసాద్ అని అడుగుదాం పదండి అనేసి స్వరాజ్యం ఆ ఇంటికి వెళ్తారు.. అక్కడ స్వరాజ్యం అందర్నీ ఒక ఆట ఆడుకుంటుంది. కోట్లు ఉన్నాయి కానీ మీ దగ్గర కొంచెం కూడా మానవత్వము సంస్కారం లేదు అనేసి అనగానే రాజేంద్రప్రసాద్ మౌనంగా ఉంటాడు కానీ పార్వతి మాత్రం స్వరాజ్యం మాటకు మాట సమాధానం చెబుతుంది. మీరు ఎలా కాదు గాని మిమ్మల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు ఎవరికి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు ఎన్నో పంచాయతీలు తీర్చాను కదా ఆ మాత్రం తెలియకుండా ఉన్నాను కదా అనేసి స్వరాజ్యం వాళ్లకి వార్నింగ్ వచ్చి వెళ్ళిపోతుంది.. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.. ఇన్ని కోట్లు ఉండి ఏం ప్రయోజనం కోడల్ని ఇంట్లో లేకుండా బయటికి గెంటేశారు. ఆ మాత్రం మీకు కొంచెం కూడా లేదు. మీరేం పెద్ద మనుషులు కట్టుకున్న భార్యను కొడుకు చేత బయటికి గెంటిస్తారా అనేసి స్వరాజ్యం దుమ్ము దులిపేస్తుంది. తనకి పార్వతి కూడా మీకు అవసరం లేని విషయాల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు విషయాలు ఏంటో తెలుసుకొని తర్వాత మాట్లాడండి అంటూ పార్వతీ గట్టి వార్నింగ్ ఇస్తుంది. స్వరాజ్యం ఎన్నెన్నో పంచాయతీలు చేయడం నా వల్లే అవుతుంది ఇలాంటి ఒక లెక్కన ఎలా రావాలో అలా వస్తాననేసి బెదిరిస్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దయాకర్ నేను మళ్ళీ వస్తాను ఈసారి డబ్బుల కోసం కాదు న్యాయం కోసం వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు.
ఇక కమల్ శ్రీకర్ని బయటకు తీసుకెళ్లి భోజనం ఎక్కడుందో తెలిసిపోయింది కదా మనం వెళ్లి ఒకసారి మాట్లాడేసి ఇక్కడికి తీసుకొని వద్దాం పద అనేసి అంటాడు. శీను ఇంట్లో ఉన్నప్పుడే మనకు తెలిసిందని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది పొద్దున ఎక్కడుందో తెలిసింది కదా ఇప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేసి అంటాడు. ఇక కమ్మలు వదిన ఎక్కడుందో తెలిసిపోయింది అన్నయ్యకు చెప్పాలి అని ఫోన్ చేస్తాడు. అక్షయ్ కి ఈ విషయం చెప్తాడు దయాకర్ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే వదిన ఉంది అని వెంటనే వెళ్లి భోజనం తీసుకురా అన్నయ్య అనేసి అంటాడు. కానీ అక్షయ మాత్రం ఏం మాట్లాడుకున్నా ఉంటాడు నీకు చెప్పిన ఒకటే బండరాయికి చెప్పిన ఒకటే అనేసి కమల్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత పార్వతి పల్లవి ఇద్దరు దయాకర్ ఇంటికి వెళ్లి అవని దగ్గర అవనికి గట్టి వార్నింగ్ ఇస్తారు. డబ్బులు ఇచ్చి దులుపుకోవాలని పార్వతి అనుకుంటుంది. కానీ అవని మాత్రం నాకు ఈ డబ్బులు వద్దు మనమధ్య బంధుత్వం ఎప్పటికైనా నేను నా తప్పు నిరూపించుకొని ఆ ఇంటికి వస్తాను అనేసి అంటుంది.
ఇక పల్లవి పార్వతి మనసులో అవని పై ద్వేషాన్ని నింపుతుంది. నేను మళ్ళీ ఆ ఇంటికి వస్తాను ఆ ఇంట్లో అందర్నీ నాకు పెట్టెలో పెట్టుకుంటాను అన్నట్లు అక్క వార్నింగ్ ఇచ్చింది అత్తయ్య మీరు ఆలోచించండి ఒక్కసారి అనేసి పల్లవి పార్వతికి ఎక్కించి చెప్తుంది. ఇక కమల్ భానుమతిని ఆట ఆడుకుంటాడు. బిర్యాని ఆశ చూపించి షాక్ ఇస్తాడు.. ఇక రాత్రయితే అక్షయ్అవని చూడాలని దయాకర్ ఇంటికి వెళ్తాడు. అవని రాగానే అక్షయ్ ను చూసి ఫీల్ అవుతుంది.. నువ్వు ఇంత పెద్ద నిందని మోస్తున్నావ్ అవని ఇంట్లో పరిస్థితులు బట్టి నేను నోరు మూసుకొని ఉన్నాను తప్ప ఇంకేం లేదు నువ్వంటే నాకు ప్రేమ చచ్చిపోలేదు అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి గురించి పార్వతీకి నిజం తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..