Intinti Ramayanam Today Episode February 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రధర్ రాజేశ్వరి ఇంటికి వస్తారు. చక్రధర్ ని చూసిన అక్షయ తో పాటు మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు కూడా రెచ్చిపోతారు.. మా ఇంటికి ఎందుకు వచ్చావురా అని అంటారు.. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా ఇంటికి వస్తావని గొడవకు దిగుతారు.. అది చూసిన రాజేశ్వరి నా భర్తని కొట్టడానికి మీరెవరు ఎంత ధైర్యం ఉంటే నా భర్త కాలర్ పట్టుకుంటారు అని రాజేశ్వరి సీరియస్ అవుతుంది.. అక్షయ్ నీ కొట్టడంతో అవని నా భర్తను కొడుతున్నారేంటి అని అడుగుతుంది.. ఆడదానివి కాబట్టి బతికి పోయావు లేదంటే నీకు కూడా చెంప పగలకొట్టేది అని రాజేశ్వరి అంటుంది… డాడీ ని జైలు నుంచి తీసుకురాకుండా అడ్డుకునేది ఈ అవని పల్లవి అనడంతో కమల్ పల్లవి పై సీరియస్ అవుతాడు..
మీ నాన్న చేసిన దుర్మార్గపు పనుల వల్లే మా అన్నయ్య వదిన మీ నాన్నని జైల్లో పెట్టించారు.. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది అని కమల్ వార్నింగ్ ఇస్తాడు..రాజేశ్వరి వాళ్ళు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. నా అల్లుడు జైలు నుంచి వచ్చాడు అని మేము అందరం సంతోషిస్తుంటే మీరేం గొడవ పడుతున్నారు అని భానుమతి అరుస్తుంది.. కానీ చక్రధర్ మాత్రం మీ మర్యాదలు నాకేం అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్ తో కలిసి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఒక్కసారిగా పల్లవి ఉలిక్కిపడి లేస్తుంది.. ఒకవేళ ఇంట్లో నిజం తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. మా డాడీకి ఫోన్ చేసి ఏం చేయాలో ఒకసారి కనుక్కోవాలి అని అనుకుంటుంది ఇక చక్రధర్ కి ఫోన్ చేసి చెప్పగానే ఆ మీనాక్షిని లేపేద్దామని చక్రధరంటాడు.. మనం లేపేయాల్సింది మీనాక్షిని కాదు డాడ్ అవనీని అని పల్లవి చెప్పగానే చక్కగా కూడా సరే అమ్మ అవనిని లేపేసే ప్లాన్ చేద్దామని అంటాడు.. అవును డాడీ మనము మీనాక్షిని ఏమైనా చేస్తే మనకు ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఆ అవని నేను లేపేస్తే మన హ్యాపీగా ఉండొచ్చు అని పల్లవి సలహా ఇస్తుంది. అలాగే అమ్మ నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని చక్రధరంటాడు.. పల్లవి చక్రధరి ఇద్దరు కలిసి పక్క ప్లాన్ చేసి అవి నేను చంపేందుకు కుట్ర చేస్తుంటారు.
పల్లవి తన తల్లిని ఎంతగా అవమానించిందో అని ఆలోచిస్తున్న అవని అసలు మా అమ్మ ఎక్కడికి వెళ్లింది అర్థం కావడం లేదే.. ఆ చక్రధర్ ఏదైనా చేశాడా? ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్రధర్ మంచి వాడిని నమ్ముతున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి మాత్రం నువ్వు ఎంత ఆలోచించినా కూడా నీకు ఎలాంటి ప్రయోజనం లేదు మీ అమ్మని చంపేస్తాను. అంతకన్నా ముందు నిన్ను చంపేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక చక్రధర్ ని అవనీని చంపేందుకు ప్లాన్ చేయమని అడుగుతుంది. అక్షయ్ తో మా అమ్మ ఎక్కడికి వెళ్లిందో అర్థం కావట్లేదని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అవని బాధని తెలుసుకున్న అక్షయ్ అభితో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటాడు..
ఇక రాజేంద్రప్రసాద్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ్. పల్లవి ముందు ఈ ముసలోని వేసేస్తే నేను సేఫ్ గా ఉండొచ్చు లేదంటే నా మొగుడు నన్ను చంపేస్తాడు అని ఆలోచిస్తుంది. మొత్తానికి అవనికి అలాగే రాజేంద్రప్రసాద్ కి చెక్ పెట్టాలని ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆలోచించి అవనీని చంపేందుకు ప్లాన్ చేస్తారు. మీనాక్షి దొరికింది అని అవని నీ ఒంటరిగా బయటకు రప్పించి అప్పుడు మనం చంపేయాలి అని అంటాడు. చక్రధర్ పల్లవి ప్లాన్ ప్రకారం బయటికి రప్పించాలని ప్లాన్ చేస్తుంది పల్లవి. నీకు ఇవాళ ఆఖరి రోజు ఎంతగా ఎగురుతావో ఎగురు ఆ తర్వాత నువ్వు చచ్చిపోతావు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది.
Also Read : ప్రేమకు షాకిచ్చిన ధీరజ్.. నర్మదకు ఝలక్ ఇవ్వబోతున్న భాగ్యం..సెంటిమెంట్ వర్కౌట్..
అవని తన తల్లి ఎక్కడుందో వెతకాలని అనుకుంటుంది. తల్లి గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్లిపోతుంది. పల్లవి అది గమనించి గొంతు మార్చి ఎవరో తెలియని వ్యక్తి లాగా ఫోన్ చేసి చెప్తుంది. మీరు అవని నేను అండి మీ అమ్మగారు ఇక్కడ రామాలయంలో కనిపించారు మీరు రండి అని చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న అవని అవునండి మా అమ్మగారే ఎక్కడ కనిపించారు ఏ రామాలయంలో అని అడుగుతుంది. ఇక పల్లవి అవని బయలుదేరిన విషయాన్ని చక్రధర్ కు ఫోన్ చేసి చెప్తుంది. ఇక ఆ డ్రైవర్ కి ఫోన్ చేసి అవని వస్తున్న విషయాన్ని చెప్తాడు చక్రధర్.. అవని రావడం గమనించిన డ్రైవరు తనని ఎలాగైనా సరే ఇవాళ చంపేయాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అవనీని చంపేస్తారా లేదంటే అక్షయ కాపాడుతాడా అన్నది చూడాలి.