Intinti Ramayanam Today Episode January 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి నే ఇదంతా చేసిందని తెలుసుకున్న అవని పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా చంప వాయిస్తుంది. ఇప్పటికైనా మారతావని నేను అనుకుంటున్నాను లేదంటే మాత్రం కచ్చితంగా ఈ వీడియోని నీ మొగుడికి చూపిస్తాను అని అంటుంది.. పల్లవి ఏమొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది.. ఆ తర్వాత సంక్రాంతి సంబరాలు భాగంగా అందరూ గుడికి వెళ్తారు.. గుడిలో ప్రత్యేక పూజలు చేపిస్తారు. ఆ పూజలో భాగంగా దేవుడికి కోట్ల ఆస్తి తిరిగి వచ్చినందుకు నగలు ఇవ్వాలని అనుకుంటారు..
రాజేంద్రప్రసాద్ కుటుంబానికి ఆ గుడిలోని పూజలు ఘన స్వాగతం పలుకుతారు. దేవుడికి నగలు వేయాలనుకున్న విషయాన్ని వాళ్ళు చెప్తారు. కానీ అక్కడ ఉన్న పూజారి మాత్రం సాయంత్రం పెద్ద పూజ ఉంది. ఆ తర్వాత మీరు వెయ్యాలి అని అంటాడు. పూజారి గారు మేము గుడిలోని ఉత్సవాల గురించి చూసి వస్తాము అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అయితే పల్లవి ఇదే అదునుగా భావించి ఆ నగలని కొట్టేసే ప్లాన్ చేయిస్తుంది. లింగం కి ఫోన్ చేసిన పల్లవి ఎక్కడికి వెళ్లావు రెండు రోజుల నుంచి నీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడికి వెళ్లావు మీ ఇంటికి కూడా వెళ్లాను కానీ నువ్వు అక్కడ లేవు అని పల్లవి అడుగుతుంది.. పల్లవి ఏక లింగంతో కలిసి ఒక ప్లాన్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అతని చూడగానే అక్షయ్ కమల్ ఇద్దరూ రెచ్చిపోయి గల్లా పట్టుకుంటారు.. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన మా ఊరి సర్పంచి అయిన ఏమైనా చేస్తే మీరు ఈ ఊరి పొలిమేర దాటి వెళ్ళలేరు అని అంటారు.. ఈ అవని క్యారెక్టర్ చాలా చెడ్డదని విన్నాను ఈమె గురించి అన్ని తెలుసుకునే వచ్చాను ఈమె అలాంటిది కదా అనేసి ఏక లింగం అంటాడు.. ఇక నగలను అమ్మవారికి అలంకరించాలని పూజారి చెప్తాడు.. అవి ఒరిజినల్ నగలు కాదో తేల్చండి ముందు ఆ తర్వాతే అమ్మవారికి పెట్టొచ్చు అని ఏక లింగం అంటాడు. అవనిని అందరూ అవమానిస్తూ ఉంటే అవని మాత్రం దేవుడి దగ్గరికి వెళ్లి వీళ్ళందరూ నన్ను మోసగత్తే అంటున్నారు అమ్మ నువ్వు నా తప్పేమీ లేదని నిరూపించు అని కోపంగా మాట్లాడుతుంది..
ఇక తర్వాత అవని దేవుడి దగ్గరికి వెళ్లి నేను తప్పు చేసి ఉంటే నన్ను శిక్షించు లేదంటే అసలు నిజం ఏంటో నిరూపించు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. నువ్వు చేసింది తప్పు కానీ మా అమ్మ వారిని నిందిస్తావా అని ఏకలింగం అంటాడు.. ముందు గిల్టు నగల్ని ఎందుకు పెట్టాలనుకున్నావో అది చెప్పు అని ఏకలింగం అడగ్గానే అవని అమ్మవారి పూనిన్నట్లు ప్రవర్తిస్తుంది.. ఏకలింగని త్రిశూలం పట్టుకొని పరిగెత్తిస్తుంది. అది చూసి అవనికి నిజంగానే అమ్మవారు కూనిందని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు.. నిజంగానే ఏకలింగం తప్పు చేశాడని అందరూ అనుకుంటారు. ఏక లింగం మీద త్రిశూలం పెట్టి ఎవడు తప్పు చేశాడో చెప్పాలి అని అడుగుతుంది . ఇక ఏకలింగం మొత్తం అన్ని విషయాలను పంచుకుంటాడు.
పల్లవి ఎక్కడ తన మేటర్ బయట పెడతాడు అని భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. పల్లవి తో కలిసి నువ్వు చేసిన మోసాలు అన్యాయాల గురించి నాకు అన్ని తెలుసు. నువ్వు ఆ నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అని ఏకలింగంకి షాక్ ఇస్తుంది దాంతో ఏకలింగం అసలు నిజాన్ని బయటకు కక్కేస్తాడు. ఆ తర్వాత ఏక లింగం ని చంపబోతుంది అవని. ఇక్కడున్న వాళ్ళందరూ శాంతించు అని అనగానే అవని మళ్లీ మామూలుగా మారిపోతుంది. ఆ తర్వాత ఏకలింగంని పోలీసులు పట్టుకొని వెళ్లిపోతారు. ఆ తర్వాత కని అందరూ కలిసి ఏకలింగం చేసిన మోసాల గురించి మాట్లాడుకుంటారు..
ఏకలింగం సర్పంచ్ ముసుగులో చాలా తప్పుడు పనులు చేశాడు. మీకోసం ఎన్ని చేసినా కూడా వాటన్నిటిని తాను తన ప్రయోజనాల కోసం వాడుకున్నాడు.. ఆ తర్వాత వాడి పీడ వదిలిపోయింది కదా మేము ఇక రేపు మా ఊరికి వెళ్ళిపోతున్నాము అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు.. కోటిలింగం మీరు అప్పుడే వెళ్ళిపోతారా నా ఫ్రెండ్ ని మొదలుపెట్టి నేను ఉండలేను మీరు మాతో పాటు ఇక్కడ ఉండిపోవచ్చు కదా అని అంటాడు. కానీ మేము వెళ్ళిపోవాలి మాకు అక్కడ చాలా పనులు ఉన్నాయి అని వాళ్లంటారు..
Also Read : చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బాలు.. ప్రభావతికి షాక్.. రోహిణి దొరికిపోతుందా..?
మీరు మళ్ళీ వస్తారు కదా మిమ్మల్ని వదిలిపెట్టి ఆరాధ్యని వదిలిపెట్టి అస్సలు ఉండలేను అని ఏకలింగం అంటాడు.. మీ అందరితో కలిసి నేను ఒక ఫోటో దిగాలి అనుకుంటున్నాను అని ఏకలింగం అంటాడు. ఫోటో నే కదా నేను దింపుతాను అని ఒక అతను ఆ ఫోటోని తీస్తాడు.. ఇలాంటి మంచి మనుషులకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇది మా అమ్మ పుట్టిన ఊరు. మా అమ్మ జ్ఞాపకాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి మీకు ఏ కష్టం వచ్చినా మాకు ఒక్క ఫోన్ చేయండి మీకోసం మేము వస్తాము. మీరు మా వాళ్లు మేము మీ వాళ్ళం ఆ సంగతి గుర్తు పెట్టుకొని అని అక్షయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…