Intinti Ramayanam Today Episode March 10th: నిన్నటి ఎపిసోడ్ లో..అవని ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అలాంటి అవనీని నేను ఎన్ని మాటలని ఇబ్బంది పెట్టాను అని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది. అసలు అవని ఇంతగా ఎందుకు అవమానించను నాకే అర్థం కావడం లేదు. కన్న తండ్రి అని తెలిసిన కూడా అవని చెప్పుకోకపోవడం నిజంగా ఆమె గొప్పతనం.. రాజేశ్వరి గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి రాజేశ్వరి కి నిజం తెలిస్తే తను బ్రతుకుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు భయంగా మారింది అని రాజేశ్వరి భయపడిపోతుంటుంది..
అసలు రాజేశ్వరికి విషయం తెలిస్తే ఎలా తట్టుకుంటుందో అర్థం కావడం లేదు అని పార్వతీ బాధపడిపోతూ ఉంటుంది. అక్షయ్ కమల్ ఇద్దరూ కూడా అత్తయ్య అర్థం చేసుకుంటుంది అని ఓదారుస్తారు. పల్లవి చక్రధర్ ని ఎందుకు ఇలా చేశారు డాడ్ అని సీరియస్ గా తిడుతుంది. పల్లవి మా మామ పరిస్థితి ఇప్పుడు బాగోలేదు అని చెప్పగానే భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత నువ్వు ఇక్కడే ఉంటే మా మామ్ ఇక శాశ్వతంగా కళ్ళు తెరవదు అని పల్లవి చక్రధరిని తిడుతుంది.. చక్రధర్ మాత్రం రాజేశ్వరి అడిగిన మాటలపై ఆలోచిస్తూ ఉంటాడు.. పల్లవి చక్రధర్ని ఒక్కో మాట అడిగి కడిగి పడేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి తన తండ్రిని తనకు కాకుండా చేసింది అని అవని పై కోపాన్ని పెంచుకుంటుంది.. అవని మా డాడ్ మా మామ్ ని విడదీసింది అని తనపై రివెంజ్ తీర్చుకోవాలి అని అంటుంది. వెళ్లి అవనితో తాడోపేడో తేల్చుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. వేదో సాధించావు అని విర్రవీగుతున్నావ్ కదా.. మా మామ్పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. మా నాని మీ నాన్నని చాలా సంతోషంగా ఉన్నావు కదా అనేసి పల్లవి అవనిని అంటుంది. ఇప్పుడు నేనేం చేశాను మీ నాన్న కదా ఒప్పుకున్నాడు అని అవని అంటుంది.. మా నాన్నని అలా ఒప్పించేలా చేశావు నువ్వు తెలివైన దానివే అవును ఒప్పుకుంటాను అని పల్లవి అవని అంటుంది.. మా అమ్మ చాలా వీక్ మీ అమ్మ లాగా స్ట్రాంగ్ కాదు. అందుకే ఇన్ని రోజులు మా మామ్చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మాత్రం దారుణమైన పరిస్థితిలో ఉంది అని పల్లవి తన తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నిన్ను కానీ మా మామ్ ని ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చిన ఆ చక్రధర్ ని అసలు వదిలిపెట్టను అని పల్లవి వెళ్ళిపోతుంది..
కానీ అవని మాత్రం మా అమ్మకి ఎలా అయితే ధైర్యం ఇచ్చావు పిన్నికి కూడా అలాంటి ధైర్యాన్ని ఇవ్వు దేవుడా అని ప్రార్థిస్తుంది.. అయితే చక్రధర్ తాను చేసిన తప్పులు అన్నిటిని ఒప్పుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. ఫ్రెండ్ దగ్గర తను మారిపోయిన విషయాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇన్ని రోజులు నేను ఎంతో మందిని ఇబ్బంది పెట్టాను. ఇప్పటివరకు ఈ నేను ఎంతమంది ఉసురు పోసుకున్నానో తెలియలేదు కానీ నాకు మాత్రం అవని వల్లే కళ్ళు తెరుచుకున్నాయి అనేసి అంటాడు. మార్పు మంచిదే రా నువ్వు ఇన్ని రోజులు మారావ్ అనుకున్నాను కానీ ఇంతగా మారిపోవడం నాకు కూడా ఆశ్చర్యమేస్తుంది అని అతను అంటాడు. నువ్వు అన్ని నిజాలే చెప్పాలని అనుకుంటున్నప్పుడు కొన్ని అవమానాలు కూడా తప్పవు నిన్ను కొంతమంది మాటలతో ఇబ్బంది పెడతారు అది నువ్వు గుర్తుంచుకోవాలి అని అతను చెప్తాడు.. అన్నిటికీ సిద్ధపడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను రా అనేసి చక్రధర్ అనుకుంటాడు.
నువ్వు ఇంత నిర్ణయించుకున్న తర్వాత నేనేం చెప్తాను చెప్పు నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి.. నీకు మంచే జరగాలని ఒక ఫ్రెండ్ గానే కోరుకుంటున్నాను అని చక్రధర్ కి తన ఫ్రెండు ధైర్యం చెప్పి పంపిస్తాడు. ఇక అక్షయ్ కమల్ శ్రీకర్ ముగ్గురు కూడా తమ బిజినెస్ లో వచ్చిన లాభాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ తమ బిజినెస్ గురించి లాభాల గురించి చెప్పాలని అనుకుంటారు.. ఇప్పుడే ఇంట్లోకి సడన్గా చక్రధర్ ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా నువ్వు మళ్ళీ వచ్చావు ఎవరు కొంపలు కూల్చడానికి వచ్చావు మొన్న వచ్చి పెద్ద బాంబు పేల్చావు కదా అని కమల్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా సీరియస్ అవుతారు..
అయితే మీకు ఒక నిజం చెప్పాలి అని అంటాడు లోపల పల్లవి చక్రధర్ గొంతు విని బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది.. ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నాను కదా.. అది నా గురించి కాదు పల్లవి గురించే అని అక్కడ చెప్తాడు. దాంతో పల్లవి టెన్షన్ పడిపోతూ ఆ నిజాన్ని బయట పెట్టొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది.. కానీ పల్లవి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. తనకి మీ నాన్నని చంపాలనుకునేది ఎవరో కాదు ఈ పల్లవిని అని నిజాన్ని బయటకు కక్కేస్తాడు చక్రధర్.. అయితే చక్రధర్ పల్లవిని కొడతాడు. అది నిజం కాదు కలలో పల్లవి తనకు జరగబోయే దాని గురించి భయపడుతూ ఉంటుంది. నన్ను కొట్టదు కొట్టదు అని నిద్రలో కలవరిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ పని పాట లేకుండా పడుకుంటే ఇలాంటి కలలే వస్తాయి అని వెళ్ళిపోతాడు.
Also Read : ‘ పొదరిల్లు ‘ తాయారు రియల్ లైఫ్..లవ్ స్టోరీలో ట్విస్ట్..
ఎలాగైనా సరే డాడ్ తో నేను మాట్లాడాలి అని అనుకుంటుంది.. ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెళ్లడానికి రెడీ అవుతారు. ఇక అందరూ కలిసి సరదాగా కమల్ ని రెడీ చేసి ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతారు. తన ముగ్గురు కొడుకులు సంతోషంగా ఉన్నారు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మేము ముఖ్యమైన అగ్రిమెంట్ ని చేయించుకోబోతున్నాము అని పార్వతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ముగ్గురు అన్నదమ్ములు.. బయటికి వెళ్తుంటే అవని నువ్వు వాళ్లకి ఎదురు వెళ్ళమ్మా అనేసి పార్వతి అంటుంది. చక్రధర్ మాత్రం తాను చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నిజాలు అన్నీ బయటపెట్టాలి అని అనుకుంటాడు. అవినీకి చక్రధర్ ఫోన్ చేసి అసలు నిజాన్ని చెప్పాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అవనికి చక్రధర్పల్లవి గురించి భయంకర నిజాన్ని చెప్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..