Pak On Team India: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. 2007 సంవత్సరంలో మహేంద్రసింగ్ ధోని సారధ్యంలో టైటిల్ గెలిచిన టీమిండియా, రెండోసారి 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరో టైటిల్ అందుకుంది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మరో టైటిల్ దక్కించుకుంది టీమిండియా. అయితే టీమిండియా ఇలా మూడు టైటిల్స్ గెలవడమే కాకుండా.. గడిచిన మూడు సంవత్సరాలలో కూడా ఐసీసీ ట్రోఫీలు మూడు దక్కించుకుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, వాళ్లకు సంబంధించిన సోషల్ మీడియా విష ప్రచారం మొదలు పెట్టింది. అంతా ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తుంది పాకిస్తాన్ సోషల్ మీడియా.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇండియా పై పాకిస్తాన్ సోషల్ మీడియా దారుణమైన పోస్టులు పెడుతోంది. ఐసీసీ బాస్ జై షా, అమిత్ షా, మహేంద్ర సింగ్ ధోని అలాగే రోహిత్ శర్మ ఈ నలుగురు కలిసి ఇండియాను గెలిపించాలని పేర్కొంటున్నారు పాకిస్తాన్ నెటిజన్స్. కావాలని బలంగా ఉన్న న్యూజిలాండ్ ను బలహీనం చేశారని.. వాళ్ల బ్యాటర్లు ఎక్కువగా పరుగులు చేయకుండా, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ ( Narendra Modi Stadium, Ahmedabad) పిచ్ ను మార్చేసారని ఆరోపణలు చేస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఈ నలుగురు, కలిసి ఫిక్సింగ్ కు తెర లేపారని వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు.
అందుకే టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసి 250 కి పైగా పరుగులు సులభంగా చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఈజీగా పరుగులు సాధిస్తుంది. కానీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మాత్రం అలా చేయలేదని పాకిస్తాన్ విష ప్రచారం మొదలుపెట్టింది. పిచ్ మార్చడం, బంతిలో చిప్ లు పెట్టారని.. ఇదంతా అమిత్ షా ఆదేశాల మేరకు జరిగిందని చెబుతున్నారు. ఒక రూమ్ లోకి వెళ్లి ఈ నలుగురు ఫిక్సింగ్ గురించి సుదీర్ఘంగా చర్చించారని కూడా చెబుతున్నారు. అందుకే అమిత్ షా తన చెయ్యి లేపి మనదే విజయం అన్నట్టు హింట్ ఇచ్చాడని
వీడియోలు వైరల్ చేస్తున్నారు.
అటు రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని , ఐసీసీ బాస్ జై షా ముగ్గురు కూడా టీమిండియా గెలవక ముందే సంబరాలు చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ముందే ఫిక్సయింది కాబట్టి, ఈ నలుగురు మొదటి నుంచి సంతోషంగా షాకింగ్ పోస్టులు పెడుతోంది పాకిస్తాన్ సోషల్ మీడియా. అయితే దీనిపై ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లకు ఆడడం చేతకాదని.. అందుకే ఇలా సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం మొదలుపెట్టారని మండిపడుతున్నారు ఇండియన్స్.
?igsh=azg2cHAzem8yMHNk