Intinti Ramayanam Today Episode March 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని దగ్గరకు వచ్చిన అక్షయ్ నిజంగా నువ్వు కింద పడిపోయావా? నాకు కూడా అబద్ధం చెప్పాలని అనుకుంటున్నావా అని అంటాడు. మీకు నేనెందుకు అబద్ధం చెప్తానండి ఆ చక్రధర్ ని ఒక ప్రమాదాన్ని ఇచ్చి కాపాడిపోయాను. అప్పుడు నాకు ఇంకా ఏం తగిలింది అని అసలు నిజం బయటికి చెప్పేస్తుంది. ఆ తర్వాత అలాంటి దుర్మార్గున్ని చంపేయనే కాకుండా ఎందుకు నువ్వు అడ్డుకున్నావు అని అక్షయ్ సిరీస్ అవుతాడు.. అలాంటి దుర్మార్గుడ్ని చస్తే చావని అని వదిలేయాలి కానీ ఇలా నువ్వు కాపాడటం నాకు నచ్చలేదు అవని అని అక్షయ్ అంటాడు. చూస్తూ ఒక ప్రాణం పోతుంటే ఎలా ఆపుతారండి. ఆయన నా తండ్రి అని కాకుండా ఒక సాటి మనిషి అని ఆలోచించి కాపాడాను అంతే అని అవని అంటుంది. పల్లవి అవని బతికి వచ్చింది అంటే నాకు మళ్ళీ ఏదో ఒక టెన్షన్ తెచ్చి పెడుతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ అవన్నీ చంపమని డాడ్ ప్లాన్ చేస్తే అదేంటి ఇలా రివర్స్ అయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. అవనిని చంపేందుకు మనం ప్లాన్ చేసాము. అయితే అవని తిరిగి హ్యాపీగా చిన్న గాయంతో ఇంటికి వచ్చింది. అసలు ఏం జరిగింది డాడీ అని పల్లవి అడుగుతుంది.. తనకి గాయమైందంటే ఒక అర్థం ఉంది మరి మీకెందుకు తలకి గాయం అయింది అని చక్రధర్ ని అడుగుతుంది పల్లవి.. ఇప్పుడు అలాంటి ప్లాన్లు ఏమీ లేకుండా మనం కాస్త గ్యాప్ తీసుకోవాలని చక్రధర్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే తన తలకి గాయం తగిలిన దృశ్యాన్ని చూసిన పల్లవి అక్కడ ఎందుకు తగిలింది మీకు అవనికి ఒకే చోట తగిలిందంటే ఏదో జరిగింది అని డౌట్ పడుతుంది. నేను వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ జరిగిందమ్మ అందుకే హాస్పిటల్ కి వెళ్లి వచ్చాను అని చక్రధర్ అంటాడు. అయితే ఆవనిని మనం చంపేందుకు ఇంకొక ప్లాన్ పర్ఫెక్ట్ గా వేయాలి డాడీ అని పల్లవి అడుగుతుంది.
ఇప్పుడే కదా ఒక ప్లాన్ ఫెయిల్ అయింది. కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక ప్లాన్ చేద్దామని చక్రధర్ అనగానే పల్లవి గ్యాప్ తీసుకోవడం ఏంటి డాడీ? ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది.. ఆవని బతికుంటే నన్ను ఎప్పుడు ఇరికిద్దమ్మ అని చూస్తుంది. ఆధారాలన్నీ మాయం చేశాను కాబట్టి బతికిపోయాను లేకపోతే కచ్చితంగా నన్ను అది పట్టుకునేది అని పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అప్పుడే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడున్న ఒక చెట్టు నుంచి కొమ్మ కింద పడిపోతూ ఉంటుంది దాన్ని చూసిన పల్లవి వెంటనే దూరంగా జరిగిపోతుంది.. అయితే ఆ కొమ్మ చక్రధర్ మీద నుంచి కింద పడిపోవడంతో పల్లవి ఊపిరి పీల్చుకుంటుంది. నేను చూసాను కాబట్టి సరిపోయింది. లేదంటే మాత్రం నా ప్రాణాలకే ప్రమాదం అయ్యుండేది అని పల్లవి ఆలోచిస్తుంది.
నువ్వు చూసావు సరే వెనక్కి తప్పుకున్నావు నన్ను కూడా లాగానే నీకు అనిపించలేదా? నాకేమైనా పర్వాలేదని అనుకుంటున్నావా అని చక్రధర్ అంటాడు.. డాడ్ అక్కడ నేను ఉండి మిమ్మల్ని కాపాడే లోపల అది నా మీద పడి ఉంటే, నాకు ఏదైనా అయిపోయేది కదా.. నేను ఉంటే మిమ్మల్ని ఏదైనా తీసుకుని వెళ్తాను కదా అని పల్లవి అంటుంది. అప్పుడే చక్రధర్ అవని తనని ప్రాణాలకు తెగించి కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. పల్లవి తో పోలిస్తే అవినీతి చాలా మంచిది అని అనుకుంటాడు. అవని వాళ్ళకి ఎలాగైనా సరే న్యాయం చేయాలి అని అనుకుంటాడు.
Also Read :నటి సుహాసిని సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
ఇక చక్రధర్ ని కలిసిన పల్లవి నేరుగా మీనాక్షి దగ్గరికి వెళుతుంది.. మీనాక్షి లోపల నిజాలు చెప్పకుండా మొండిగా ఉండడంతో పల్లవి రెచ్చిపోతుంది. పల్లవి నీ ఫాలో అవుతున్న కానిస్టేబుల్ అవినీకి ఫోన్ చేసి ఆ లొకేషన్ ని పంపిస్తాడు. ఇక ఆ అవని అక్కడికి చేరుకుంటుంది పల్లవి ఇలాంటి నిర్మానుష ప్రాంతానికి ఎందుకు వచ్చింది అని అనుమానం కలుగుతుంది.. అంటే పల్లవి మా అమ్మని కిడ్నాప్ చేసిందా..? లేదంటే ఇంకేదైనా ఇక్కడ చేస్తుందా అన్నది తెలుసుకోవాలి అని ఫాలో అవుతూ లోపలికి వెళ్ళబోతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో పల్లవి వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసిందని అవని తెలుసుకుంటుందా? మీనాక్షి భర్త గురించి చక్రధర్ నిజం చెప్తాడా అన్నది చూడాలి..