E-Paper
Advertisement

Avinash Reddy : మరోసారి విచారణకు అవినాష్ రెడ్డి దూరం.. సీబీఐ యాక్షన్ పై టెన్షన్..

Avinash Reddy : మరోసారి విచారణకు అవినాష్ రెడ్డి దూరం.. సీబీఐ యాక్షన్ పై టెన్షన్..
Advertisement

Avinash Reddy Latest News(AP breaking news today): వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు ఉత్కంఠ రేపుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి విచారణ డుమ్మా కొట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. అవినాష్ రెడ్డి రాలేదు. చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా చూపుతూ హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని సీబీఐకు లేఖ ద్వారా తెలియజేశారు. తాను విచారణకు రావడంలేదని పేర్కొన్నారు.

ఎంపీ తరఫు న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. గుండెపోటు రావడంతో తనతల్లిని పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చినట్లు లేఖలో అవినాష్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి అవినాష్‌రెడ్డి బయల్దేరగా.. తల్లిని ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది మల్లారెడ్డి చెప్పారు. తండ్రి భాస్కర్‌రెడ్ది జైల్లో ఉండటంతో తల్లిని అవినాష్ రెడ్డే చూసుకోవాల్సి ఉందని న్యాయవాది తెలిపారు.

Advertisement

మరోవైపు  అవినాష్‌రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్‌లో ఓ మీడియా సంస్థకు చెందిన వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పులివెందుల వెళ్తున్న అవినాష్‌ వాహనాన్ని మీడియా వాహనం అనుసరించింది. ఈ క్రమంలో ఎంపీ అనుచరులు ఆ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రిపోర్టర్‌కు గాయాలయ్యాయి. వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని ముందే వార్తలు వచ్చాయి. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ విచారణ తేదీ ఖరారులేదు. దీంతో అవినాష్‌రెడ్డికి దారులు మూసుకుపోయాయని న్యాయనిపుణులు అంటున్నారు. అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది.

Advertisement

మరోవైపు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఎంపీ అనుచరులు భారీగా తరలివచ్చారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి తిరిగి పులివెందులకు వెళ్లడంతో
సీబీఐ తీసుకునే తీసుకుని స్టెప్ పై ఉత్కంఠ నెలకొంది.

ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేసింది. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని ఆ రోజు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. పులివెందులకు వెళ్లిపోయారు. విచారణకు హాజరయ్యేందుకు 4 రోజుల గడువు కావాలని సీబీఐకి లేఖ రాశారు. అదే రోజు సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తప్పకుండా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. జూన్ 30 లోపు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×