E-Paper
Advertisement

Viral News: ఛీ.. సూప్ లో మూత్రం పోసిన టీనేజర్, రూ.2.56 కోట్లు జరిమానా విధించిన కోర్టు!

Viral News: ఛీ.. సూప్ లో మూత్రం పోసిన టీనేజర్, రూ.2.56 కోట్లు జరిమానా విధించిన కోర్టు!
Advertisement

Chinese Viral News:

ఈ రోజుల్లో చాలా మంది మంది యువతీ యువకులు ప్రాంక్ ల పేరుతో జనాలను చిరాకు పెడుతున్నారు. కొన్నిసార్లు భయపెడుతున్నారు కూడా. చివరకు ప్రాంక్ అంటూ ఫన్నీ చేస్తున్నారు. అప్పటిలోగా చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. తాజాగా ఇలాంటి పని చేసిన  ఇద్దరు యువకులకు చైనా కోర్టు తగిన శాస్తి చేసింది. ఏకంగా రూ. 2.56 కోట్ల జరిమానా విధించింది. జీవితంలో మరోసారి ప్రాంక్ అంటేనే సుస్సు పోసుకునేలా చేసింది. ఈ తీర్పుపై చైనాతో పాటు ఇతర దేశాల నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. బాగయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

షాంఘైలో హైడిలావ్ హాట్ పాట్ అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 1990లో సిచువాన్ ప్రావిన్స్‌ లో స్థాపించబడిన హైడిలావ్.. ప్రపంచ వ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ అవుట్‌ లెట్లను కలిగి ఉంది. తాజాగా షాంఘైలో హైడిలావ్ హాట్ పాట్ రెస్టారెంట్ లో ఊహించని ఘటన జరిగింది. ఇద్దరు 17 ఏళ్ల కుర్రాళ్లు ఓ సూప్ బౌల్ లో మూత్రం పోశారు. ఒకరు టాయిలెల్ చేస్తుండగా, మరొకరు దాన్ని షూట్ చేశాడు. ఈ వీడియోను వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజానికి ఇది ప్రాంక్ వీడియో.. కానీ, చాలా మంది నిజమే అనుకున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేసింది. ఇలాంటి సూప్ తమకు వడ్డిస్తారా? అంటూ ఆ రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లు యాజమాన్యం మీద తిరగబడ్డారు. ఊహించని పరిణామంతో రెస్టారెంట్ యాజమాన్యం ఆ రోజు రెస్టారెంట్ కు వచ్చిన వారందరికీ పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. వారి వారి బిల్లులు వెనక్కి ఇచ్చింది. సుమారు 4 వేల మందికి డబ్బులు రిటర్న్ చేసింది.

ఈ వ్యవహారంపై సీరియస్ అయిన రెస్టారెంట్ యాజమాన్యం

Advertisement

తమ రెస్టారెంట్ లో జరిగిన ఈ వీడియో వ్యవహారంపై యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఈ వీడియోను షూట్ చేసిన యువకులపై కోర్టులో కేసు వేసింది. తాము కస్టమర్లకు చెల్లించిన వాపసుతో పాటు రెస్టారెంట్ క్రెడిబులిటీకి జరిగిన డ్యామేజ్ కి పరిహారం చెల్లించేలా చూడాలని కోర్టును వేడుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరు కుర్రాళ్లకు ఏకంగా 2.2 మిలియన్ యువాన్ల ( భారత కరెన్సీలో సుమారు రూ. 2.56 కోట్లు) జరిమానా విధించింది. ఈ డబ్బులను సదరు రెస్టారెంట్ యాజమాన్యానికి చెల్లించాలని ఆదేశించింది. టీనేజర్లు చేసిన ఈ వీడియో కారణంగా ఓ ప్రతిష్టాత్మక రెస్టారెంట్ పరువుపోయిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. పిల్లలను సరిగి పెంచడంలో విఫలం అయిన తల్లిదండ్రులు ఈ జరిమానా భరించాలని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం పట్ల సదరు యువకుల కుటుంబ సభ్యులు షాక్ కు గురికాగా, తీర్పు పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. చెత్త పనులు చేసేవారికి ఇలాంటి పని కావాల్సిందే అంటూ చురకలు అంటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చైనాలో హాట్ టాపిక్ గా మారింది.

Read Also:  వీధి కుక్కలకు జీవిత ఖైదు.. జైల్లో పెట్టి మక్కెలు ఇరగదీసుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×