BigTV English
Advertisement

White Paper Release : వైసీపీ భూ దందాలు, వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల

White Paper Release : వైసీపీ భూ దందాలు, వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల

CM Chandrababu Naidu Released White Paper on YSRCP Land Scams : వైఎస్సార్సీపీ భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ పై శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో.. వైసీపీ హయాంలో జరిగిన భూ దందాలు, సహజ వనరుల దుర్వినియోగం గురించి సీఎం చంద్రబాబునాయుడు వివరించారు.


రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వం అడవులను ధ్వంసం చేసిందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో భూ దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. రీసర్వే పేరుతో భూముల హద్దుల్ని మార్చేశారన్నారు. ముఖ్యంగా విశాఖలో మాజీ ఎంపీ హయగ్రీవ భూముల్ని కాజేశారని తెలిపారు. భూదందాతో పాటు.. ఖనిజ సంపదను సైతం దోచేశారని విమర్శించారు. రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన ల్యాండ్ ను జిల్లాస్థాయిలో నివాసస్థలంగా చూపించి బెదిరించారన్నారు.

విశాఖ, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో గత ప్రభుత్వ పాలకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. ఒంగోలులో రూ.101 కోట్ల విలువైన భూముల్ని లాక్కున్నారు. తిరుపతిలో రూ.207 కోట్ల విలువైన భూముల్ని, చిత్తూరులో రూ.99 కోట్ల విలువైన భూముల్ని కాజేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణాల పేరుతో భూముల అక్రమాలకు తెరలేపారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు గత ప్రభుత్వం అసైన్డ్ భూములను అప్పగించిందని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.


గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి స్థలాలను ఆక్రమించుకున్నారని శ్వేతపత్రంలో తెలిపారు. ఖనిజ సంపదను దోచుకుని.. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. 22 A ను ఉపయోగించి తిరుపతి భూముల్ని కబ్జా చేశారని ఆరోపించారు.

Tags

Related News

Jogi Ramesh Reaction: అరెస్టు తర్వాత జోగి రమేష్ ఫస్ట్ రియాక్షన్.. దుర్మార్గానికి ఇదొక పరాకాష్ట

Rain Alert: మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న ముప్పు..

Cyber Crime: ఆధార్ వెరిఫికేషన్ పేరుతో మోసం.. 51.90 లక్షలు స్వాహా చేసిన కేటుగాళ్లు

Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో సంచలనం.. మాజీమంత్రి జోగి రమేష్ అరెస్ట్, అలర్టయిన వైసీపీ నేతలు

Kashibugga: కాశీబుగ్గ దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా

Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే: మాజీ సీఎం జగన్

Parakamani: పరకామణి కేసులో ఊహించని ట్విస్టులు..

ISRO LVM3-M5 Mission: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు సాయంత్రం నింగిలోకి LVM3-M5

Big Stories

×