E-Paper
Advertisement

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు
Advertisement

AP Dasara Holidays 2025: ఏపీ రాష్ట్ర విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి (MLC) బొర్ర గోపిమూర్తి (Borra Gopi Murthy) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2025–26 కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ప్రకటించిన దసరా సెలవుల తేదీలను మార్చాలని వినతి చేశారు.

ప్రస్తావిత మార్పు అంశం:

Advertisement

ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. దసరా సెలవులు సెప్టెంబర్ 24 (2025) నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి.

పండుగ సెప్టెంబర్ 22న ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో.. ఆ రోజు నుంచే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మార్పు జరిగితే విద్యార్థులు మొత్తం 12 రోజుల సెలవులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Advertisement

ప్రస్తుత నిర్ధారిత సెలవుల సమయం (అకడమిక్ క్యాలెండర్ ప్రకారం):

విద్యాసంస్థ విధానం -సెలవుల తేదీలు- మొత్తం రోజులు
సాధారణ పాఠశాలలు సెప్టెంబర్ 24 – అక్టోబర్ 2- 9 రోజులు
జూనియర్ కాలేజీలు సెప్టెంబర్ 28 – అక్టోబర్ 5- 8 రోజులు
క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ సెప్టెంబర్ 27 – అక్టోబర్ 2- 6 రోజులు

గోపిమూర్తి విజ్ఞప్తి ప్రభావం:

గోపీమూర్తీ అభ్యర్థన అమలు అయితే.. విద్యార్థులకు మొదటి రెండు రోజులు (సెప్టెంబర్ 22, 23) అదనంగా సెలవులు ఉంటాయి. ఈసారి మొత్తం 11 లేదా 12 రోజుల సెలవులు లభించవచ్చు.

మరో డిమాండ్‌లు:

  •  డీఎస్సీ (DSC) నియామకాలు పూర్తి చెయ్యాలని, అంతర్-జిల్లా బదిలీలు ముందస్తుగా చేపట్టాలని కూడా కోరారు.

  • పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లను కూడా.. వెంటనే ముగించాలనే అభ్యర్థన కూడా చేశారు.

మొత్తం మీద, విద్యార్థులకు మరింత విశ్రాంతిని కల్పించడానికి, పండుగ ప్రారంభమైన తేదీ నుంచే సెలవులు ప్రారంభించాలని మిడి MLC బొర్ర గోపిమూర్తి కోరుతుండడం ఒక ముఖ్యమైన అడుగు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 21వ తేదీ నుంచి.. అక్టోబర్ మూడో తేదీ వరకు స్కూళ్లకు హాలిడేస్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×