E-Paper
Advertisement

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు
Advertisement

AP Dasara Holidays 2025: ఏపీ రాష్ట్ర విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి (MLC) బొర్ర గోపిమూర్తి (Borra Gopi Murthy) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2025–26 కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ప్రకటించిన దసరా సెలవుల తేదీలను మార్చాలని వినతి చేశారు.

ప్రస్తావిత మార్పు అంశం:

Advertisement

ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. దసరా సెలవులు సెప్టెంబర్ 24 (2025) నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి.

పండుగ సెప్టెంబర్ 22న ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో.. ఆ రోజు నుంచే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మార్పు జరిగితే విద్యార్థులు మొత్తం 12 రోజుల సెలవులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Advertisement

ప్రస్తుత నిర్ధారిత సెలవుల సమయం (అకడమిక్ క్యాలెండర్ ప్రకారం):

విద్యాసంస్థ విధానం -సెలవుల తేదీలు- మొత్తం రోజులు
సాధారణ పాఠశాలలు సెప్టెంబర్ 24 – అక్టోబర్ 2- 9 రోజులు
జూనియర్ కాలేజీలు సెప్టెంబర్ 28 – అక్టోబర్ 5- 8 రోజులు
క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ సెప్టెంబర్ 27 – అక్టోబర్ 2- 6 రోజులు

గోపిమూర్తి విజ్ఞప్తి ప్రభావం:

గోపీమూర్తీ అభ్యర్థన అమలు అయితే.. విద్యార్థులకు మొదటి రెండు రోజులు (సెప్టెంబర్ 22, 23) అదనంగా సెలవులు ఉంటాయి. ఈసారి మొత్తం 11 లేదా 12 రోజుల సెలవులు లభించవచ్చు.

మరో డిమాండ్‌లు:

  •  డీఎస్సీ (DSC) నియామకాలు పూర్తి చెయ్యాలని, అంతర్-జిల్లా బదిలీలు ముందస్తుగా చేపట్టాలని కూడా కోరారు.

  • పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లను కూడా.. వెంటనే ముగించాలనే అభ్యర్థన కూడా చేశారు.

మొత్తం మీద, విద్యార్థులకు మరింత విశ్రాంతిని కల్పించడానికి, పండుగ ప్రారంభమైన తేదీ నుంచే సెలవులు ప్రారంభించాలని మిడి MLC బొర్ర గోపిమూర్తి కోరుతుండడం ఒక ముఖ్యమైన అడుగు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 21వ తేదీ నుంచి.. అక్టోబర్ మూడో తేదీ వరకు స్కూళ్లకు హాలిడేస్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×