E-Paper
Advertisement

Home Minister Anitha : అత్యాచార నిందితుల్ని వదలం.. బాధితుల కుటుంబాలకు పరిహారం : హోంమంత్రి అనిత

Home Minister Anitha : అత్యాచార నిందితుల్ని వదలం.. బాధితుల కుటుంబాలకు పరిహారం : హోంమంత్రి అనిత
Advertisement

Home Minister Anitha Press Meet in Amaravati : రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షిస్తామని హోమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల, విజయనగరం, జిల్లాల్లో జరిగిన అత్యాచార ఘటనలపై ఆమె ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ రెండు ఘటనల్లోని నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. తప్పు చేసిందెవరైనా సరే.. చట్టం నుంచి తప్పించుకోలేరని హితవు పలికారు.

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ముగ్గురు మైనర్ల చేతిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారాన్ని ప్రకటించారు. అలాగే విజయనగరం జిల్లాలో అత్యాచారానికి గురైన 6 నెలల చిన్నారి పేరుపై రూ.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు హోంమంత్రి అనిత. ఇకపై ఎవరైనా ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తే అదే వారికి చివరి రోజవుతుందని హెచ్చరించారామె.

Advertisement

Also Read : దారుణం.. ఊయలలో ఉన్న 6 నెలల చిన్నారిపై తాత అత్యాచారం

నంద్యాలజిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పీఎస్ పరిధిలోగల ఎల్లాల గ్రామానికి చెందిన 8 సంవత్సరాల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి, హత్య చేశారు. జరిగిన ఘటన గురించి బాలిక ఇంట్లో చెబుతుందన్న భయంతో హత్యచేసి, మృతదేహాన్ని సమీపంలోని చెరువులో పడేశారు. ఐదురోజులైనా ఇంతవరకూ బాలిక మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు బాలిక మృతదేహం కోసం క్షుణ్ణంగా గాలిస్తున్నారు. అడుగడుగునా వెతికించినా మృతదేహం లభ్యం కాకపోవడంతో.. అసలు బాలిక మృతదేహాన్ని అక్కడే పడేశారా లేక మరేదైనా చేసి ఉంటారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Advertisement

ముచ్చుమర్రి ఘటన మరువకముందే.. విజయనగరం జిల్లాలో ఊయలలో ఉన్న ఆరునెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. వరుసకు తాత అయిన వ్యక్తి చిన్నారిపై అఘాయిత్యం చేసి పరారవ్వగా.. తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×