E-Paper
Advertisement

Pawan Kalyan: జగన్‌కు ‘అప్పురత్న’ అవార్డు.. 9 నెలల్లో 55,555 కోట్ల అప్పు..

Pawan Kalyan: జగన్‌కు ‘అప్పురత్న’ అవార్డు.. 9 నెలల్లో 55,555 కోట్ల అప్పు..
Advertisement

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ ఈమధ్య దూకుడు మరింత పెంచారు. ఎన్నికల ఇయర్ అని కాబోలు.. జగన్ పై, వైసీపీ నేతలపై బాగా ఫైర్ అవుతున్నారు. మధ్యలో మంత్రులు అమర్నాథ్, అంబటిలు రాజకీయాలను మరింత రంజుగా మార్చేస్తున్నారు. ఇలా ఏపీ పాలిటిక్స్ అన్ స్టాపబుల్ గా సాగుతున్నాయి.

లేటెస్ట్ గా జగన్ కు ఖతర్నాక్ బిరుదు ఇచ్చారు పవన్ కల్యాణ్. ఇటీవల కేంద్ర పద్మ అవార్డులు ప్రకటించడంతో ఆ థీమ్ కు పేరడీగా.. భారతరత్న మాదిరిగా.. సీఎం జగన్ కు ‘అప్పు రత్న’ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేనాని చేసిన ఆ ట్వీట్‌.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఏపీ సర్కారు చేస్తున్న అప్పులు.. కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. గడచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.55,555 కోట్లకు చేరింది. ఆ విషయం గుర్తు చేస్తూ పవన్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు.

‘‘అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా మీకు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలి’’ అంటూ ట్విట్టర్ లో పవన్ సెటైర్లు వేశారు.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×