E-Paper
Advertisement

America: గన్ మిస్‌ఫైర్.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

America: గన్ మిస్‌ఫైర్.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

America: అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గన్ మిస్ ఫైర్ కావడంతో మహంకాళి అఖిల్‌సాయి అనే విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన సాయి ఉన్నత చదువుల కోసం పోయిన ఏడాది అమెరికాకు వెళ్లాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ.. ఓ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు.

సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకొని తన స్నేహితులతో కలిసి రూమ్‌కు వెళ్తూ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆగి కాసేపు ముచ్చటించారు. ఈక్రమంలో గార్డ్ వద్ద ఉన్న తుపాకీని పరిశీలిస్తుండగా.. అది మిస్‌ఫైర్ అయి అఖిల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే అతని స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనకు సంబంధించి ఓ తెలుగు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అనుమానితుడు రవితేజ గోలీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రవితేజ మేంట్‌గోమేరీ కౌంటీ డిటెన్షన్ ఫెసిలిటీ కస్టడీలో ఉన్నాడు.

ఇక అఖిల్ సాయి మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నత చదువుల కోసం పరాయి దేశం వెళ్లి కానరాని లోకాలకు వెళ్లడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×