E-Paper
Advertisement

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం
Advertisement

Road Accident in Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల మండలం అంజీపురం టోల్ ప్లాజా సమీపంలో ఓ లారీ ఆగి ఉంది. అయితే బైక్ పై ప్రయాణిస్తున్న వారు ఆగి ఉన్న లారీ కనిపించకపోవడంతో బలంగా వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

మృతులు నాగతేజరెడ్డి, ఇందు, అమూల్యగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుందని, వీరంతా గురజాలలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.  ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామ పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×