BigTV English

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం

Road Accident in Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల మండలం అంజీపురం టోల్ ప్లాజా సమీపంలో ఓ లారీ ఆగి ఉంది. అయితే బైక్ పై ప్రయాణిస్తున్న వారు ఆగి ఉన్న లారీ కనిపించకపోవడంతో బలంగా వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు నాగతేజరెడ్డి, ఇందు, అమూల్యగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుందని, వీరంతా గురజాలలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.  ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామ పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×