BigTV English
Advertisement

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం

Road Accident in Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల మండలం అంజీపురం టోల్ ప్లాజా సమీపంలో ఓ లారీ ఆగి ఉంది. అయితే బైక్ పై ప్రయాణిస్తున్న వారు ఆగి ఉన్న లారీ కనిపించకపోవడంతో బలంగా వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు నాగతేజరెడ్డి, ఇందు, అమూల్యగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుందని, వీరంతా గురజాలలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.  ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామ పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×