Maaza Bottle: సమ్మర్ పోయి వర్షాలు పడుతున్నా, కూల్ డ్రింక్ తాగాలనే కోరిక మాత్రం ఎవరికీ తగ్గదు కదా! కానీ, ఓ నాలుగేళ్ల బుడతడు మాత్రం ‘హాయిగా మాజా తాగుదాం’ అనుకుంటే.. అందులో అతనికి ఎదురైన అనుభవం చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఎందుకంటే, ఆ బాటిల్లో వచ్చింది మాజా మాత్రమే కాదు.. బోనస్గా ఒక పురుగు కూడా వచ్చింది!
ఈ షాకింగ్ ఘటన రంపచోడవరంలో కలకలం రేపింది. స్థానికంగా ఉండే ఒక నాలుగేళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు ‘మాజా’ డ్రింక్ కొనిచ్చారు. సరే పిల్లోడు ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు కదా అని చూసేసరికి.. ఆ లిక్విడ్లో ఏదో తేలుతున్నట్టు అనుమానం వచ్చింది. తీరా నిశితంగా గమనిస్తే, అందులో చచ్చిపోయిన పురుగు అవశేషాలు కనిపించాయి. దాంతో ఆ కుటుంబ సభ్యుల గుండె ఒక్కసారిగా జారినంత పనైంది.
అదృష్టవశాత్తూ వారు సకాలంలో ఆ పురుగును గమనించడంతో, వెంటనే బాలుడి చేతి నుంచి ఆ బాటిల్ను లాగేసుకున్నారు. లేదంటే ఆ పిల్లాడు దాన్ని తాగేసి తీవ్ర అస్వస్థతకు గురయ్యేవాడు. తృటిలో పెద్ద ప్రమాదమే తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: ఉక్రెయిన్లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
ఈ విషయం చుట్టుపక్కల తెలవడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ‘మేము నమ్మి కొనుక్కునే బ్రాండెడ్ డ్రింక్స్లోనే ఇలాంటివి ఉంటే.. ఇక మా పిల్లల ప్రాణాలకి గ్యారెంటీ ఏంటి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఏదేమైనా, పిల్లలకి ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్స్, డ్రింక్స్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మన బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
'మాజా' డ్రింక్లో పురుగులు
పోలవరం జిల్లా రంపచోడవరంలో ఓ నాలుగేళ్ల బాలుడు 'మాజా' తాగుతుండగా అందులో పురుగు అవశేషాలను గమనించిన కుటుంబ సభ్యులు షాకయ్యారు. సకాలంలో గుర్తించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.#Rampachodavaram #FoodSafety #SoftDrinkIssue pic.twitter.com/7B03VgHZyB
— BIG TV Breaking News (@bigtvtelugu) July 20, 2026