Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లబడింది. ముఖ్యంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన జోరందుకుంది. ఇక రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోనూ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖలు హెచ్చరించాయి.
తెలంగాణలో రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ వానల ముప్పు పొంచి ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు , కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.
Also Read: కోర్టుపై నమ్మకం లేదా? హైడ్రా రంగనాథ్పై హైకోర్టు సీరియస్!