E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Cognizant Bonus: ఉద్యోగులకు 100 శాతం బోనస్.. గుడ్ న్యూస్ చెప్పిన కాగ్నిజెంట్

Cognizant Bonus: ఉద్యోగులకు 100 శాతం బోనస్.. గుడ్ న్యూస్ చెప్పిన కాగ్నిజెంట్
Advertisement

Cognizant Bonus: ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025 సంవత్సరానికి 100 శాతం బోనస్ ప్రకటించింది. రెండేళ్ల ముందుగానే తన లక్ష్యాన్ని చేరుకున్నందుకు గానూ.. ఈ బోనస్ ప్రకటించినట్లు తెలిపింది. అగ్రశ్రేణి పనితీరుతో కంపెనీ “విన్నర్స్ సర్కిల్”లోకి ప్రవేశించిందని సీఈవో ఎస్.రవి కుమార్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో తెలిపారు.

100 శాతం బోనస్

“2025 ఫలితాలు క్రమశిక్షణతో కూడిన పనితీరు, మా క్లయింట్లు, కాగ్నిజెంట్ పట్ల నిబద్ధతకు ప్రత్యక్ష ఫలితం. ఉద్యోగుల ప్రయత్యాలను గుర్తించి, 100 శాతం బోనస్ ప్రకటించేందుకు సంతోషంగా ఉన్నాము” అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవి కుమార్ తెలిపారు. కాంగ్నిజెంట్ కంపెనీలో 3,50,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది భారతదేశంలోనే ఉన్నారు.

ఆదాయంలో సూపర్

Advertisement

కాగ్నిజెంట్ 2027 నాటికి ‘విన్నర్ సర్కిల్’ అనే లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంది. కానీ 2025లో దానిని సాధించింది. నిర్దేశించుకున్న లక్ష్యానికి ముందుగానే విజేత సర్కిల్‌కు చేరుకోవడం కంపెనీ సాధించిన పురోగతిని ప్రతిబింబిస్తుందని సీఈవో అన్నారు. 2025లో 6.4 శాతం వృద్ధిరేటుతో కాగ్నిజెంట్ “విన్నర్ సర్కిల్”లోకి ప్రవేశించింది. 2025 మొత్తానికి కాగ్నిజెంట్ ఆదాయం 7 శాతం పెరిగి 21.10 బిలియన్ డాలర్ల (అంటే సుమారు రూ.1.90 లక్షల కోట్లు)కు చేరింది. ఈ కంపెనీ జనవరి-డిసెంబరును ఆర్థిక సంవత్సరంగా భావిస్తుంది. ఈ సంస్థ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది.

Also Read:  గ్లోబల్ మార్కెట్‌లో భారత్ గర్జన.. అమెరికాతో బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం సిద్ధం!

Advertisement

కంపెనీ అంతర్గత బెంచ్‌మార్కింగ్ ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా కాగ్నిజెంట్ ఆదాయం క్రమంగా వృద్ధి సాధిస్తుంది. 2022లో 10వ స్థానం, 2023లో ఎనిమిదో స్థానం, 2024లో ఆరవ స్థానానికి చేరుకుంది.

Related News

14 ఏళ్లకే AI స్టార్టప్ పెట్టేసిన బుడ్డోడు.. ఏకంగా బుర్జ్ ఖలీఫాలో ఆఫీసు, అతడు ఏం చేస్తాడంటే?

రియల్ ఎస్టేట్ బూమ్.. దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరు.. 19 శాతం పెరుగుదల, హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి పతనం.. ఇంకా పడే ఛాన్స్, 2025 తర్వాత తొలిసారి ఆ స్థాయికి

పొదుపుకు ఏ స్కీమ్ బెటర్.. ఆ మూడింటిలో ఎక్కువ రాబడి ఏది? నెలకు రూ.13 వేలు పైమాటే

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. 20 వేల మంది ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ నోటీసులు

ఆన్‌లైన్‌లో మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు, అదెలా సాధ్యం, ఆర్‌బిఐ ఏం చెబుతోంది?

బంగారు ప్రియులకు శుభవార్త.. మార్కెట్లో పడిపోతున్న ధరలు, ఇంకెందుకు ఆలస్యం

పెళ్లిళ్ల సీజన్ ఆఫర్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన పసిడి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే!

Big Stories

×