E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఆన్‌లైన్‌లో మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు, అదెలా సాధ్యం, ఆర్‌బిఐ ఏం చెబుతోంది?

ఆన్‌లైన్‌లో మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు, అదెలా సాధ్యం,  ఆర్‌బిఐ ఏం చెబుతోంది?
Advertisement

RBI: దేశంలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది కేంద్రం. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మనీ బదిలీల విషయంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన తర్వాత అటువైపు ఫోకస్ చేసింది. ఈ క్రమంలో లేనిపోని డిజిటల్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్ మోసంలో డబ్బు పోగొట్టుకున్నారా? 25 వేల రూపాయల వరకు తిరిగి పొందవచ్చని చెబుతోంది ఆర్‌బిఐ.

ఆర్‌బిఐ కొత్త నిబంధనలు.. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి

Advertisement

ఆన్‌లైన్‌లో వినియోగదారుడు తెలియని తప్పుడు లింక్ క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులు పోగొట్టుకునేవారు. పోయిన డబ్బులు తిరిగి వస్తాయన్న నమ్మకం బాధితుల్లో లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. డిజిటల్ చెల్లింపుల మోసాల బాధితులకు ఊరట కల్పించేలా కొత్త మార్గ దర్శకాలను ప్రకటించనుంది. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి.

దేశంలో మొబైల్ లావాదేవీలు వేగంగా జరుగుతున్నాయి. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వీటి గురించి చెప్పనక్కర్లేదు. అదే సమయంలో సైబర్ మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. డిజిటల్ మోసాల బారిన పడిన వినియోగదారులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించింది ఆర్బీఐ.

Advertisement

ఆన్‌లైన్‌లో మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు

డిజిటల్ లావాదేవీని గుర్తించిన ఐదు రోజుల్లో కస్టమర్ తన బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే చాలు. దర్యాప్తు తర్వాత రూపొందించే షరతులకు అనుగుణంగా ఉంటే గరిష్ఠంగా రూ. 25 వేలు పరిహారం పొందవచ్చు. ఈ విషయంలో బాధితులకు ఊరట ఇవ్వనుంది. ఈ తరహా మోసాలు జరగకుండా నిరోధించడంపై దృష్టి సారించింది ఆర్‌బీఐ.

తొలుత బ్యాంకులు తమ అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జవాబుదారీతనం ఉండేలా దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటివి వినియోగించాలని సూచన చేసింది.

ALSO READ: బంగారు ప్రియులకు శుభవార్త.. మార్కెట్లో పడిపోతున్న ధరలు, ఇంకెందుకు ఆలస్యం

అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం, మోసాలను పసిగట్టడానికి వినియోగదారుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి బ్యాంకులు ఏఐ వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. దీన్ని మెరుగైన నిర్వహణ, వినియోగదారుల డబ్బు కోల్పోకముందే మోసపూరితను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరచనుంది.

ఏఐ వాడకంపై స్పష్టమైన నియమావళి లేకపోవడం బ్యాంకులకు ఒక అడ్డంకిగా ఉండేది. ఆర్‌బీఐ మార్గదర్శకాలతో అనిశ్చితి తొలగిపోనుందని బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ వినియోగానికి అడ్డంకి కాదని, దాని వేగాన్ని మరింత పెంచుతుందని అంటున్నాయి.

Related News

బంగారు ప్రియులకు శుభవార్త.. మార్కెట్లో పడిపోతున్న ధరలు, ఇంకెందుకు ఆలస్యం

పెళ్లిళ్ల సీజన్ ఆఫర్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన పసిడి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే!

భారీగా తగ్గిన పసిడి ధరలు.. 22 క్యారెట్, 24 క్యారెట్ లేటెస్ట్ రేట్స్!

వామ్మో భారీ మార్పులు.. జూలై ఒకటి నుంచి మొదలు, ఆధార్ మొదలు బ్యాంకుల వరకు

దేశంలో సైబర్‌ దాడులు తీవ్రతరం.. వ్యాపారవేత్తల్లో వణుకు, బజాజ్ ఆటో వంతు

కంపెనీ అమ్మేసి, ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన యజమాని.. లక్కంటే వీళ్లదే!

కేంద్రం కొత్త కసరత్తు.. బ్యాంకు ఉద్యోగులకు పండగే, అంతా డిజిటల్ మయం

Big Stories

×