E-Paper
Advertisement

WPL 2026 Final: ఢిల్లీకి మ‌రోసారి నిరాశే..రెండోసారి ఛాంపియ‌న్ గా RCB, ఫ్రైజ్ మనీ ఎంతంటే

WPL 2026 Final: ఢిల్లీకి మ‌రోసారి నిరాశే..రెండోసారి ఛాంపియ‌న్ గా RCB, ఫ్రైజ్ మనీ ఎంతంటే
Advertisement

WPL 2026 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ టోర్నమెంటులో విజేత ఎవరనేది తేలిపోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. వడోదర వేదికగా జరిగిన ఈ ఫైనల్స్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి ఛాంపియన్ అయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ విధించిన 203 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి చేదించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు. దీంతో రెండోసారి ఈ టైటిల్ గెల్చుకుంది బెంగళూరు. అటు నాలుగోసారి వరుసగా ఫైనల్ లో ఓడిపోయి చెత్త రికార్డు నమోదు చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు జట్టు.

Also Read: MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల్లో జట్ల మధ్య జరిగింది. వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు అలాగే ఢిల్లీ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది.

ఈ సందర్భంగా నిర్ణిత 20 ఓవర్లు ఆడింది ఢిల్లీ మహిళల జట్టు. ఈ నేపథ్యంలో 20 ఓవర్లు ఆడిన ఢిల్లీ , నాలుగు వికెట్ల నష్టానికి 203 పరుగులతో రెచ్చిపోయింది. ఫైనల్ మ్యాచ్ లో 23 పరుగులు చేయడం చాలా గ్రేట్. అయితే ఆ టార్గెట్ ను నిలుపు కోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి నిరాశపరిచింది. దీంతో నాలుగోసారి కూడా ఫైనల్ దాకా వచ్చి ఓడిపోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళలు జట్టు చేదించింది. దీంతో వరుసగా రెండోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలిచింది. బెంగళూరు కెప్టెన్ స్మృతి మందన ఈ మ్యాచ్ లో 41 బంతుల్లో 87 పరుగులు చేయడం జరిగింది. అటు వాల్ 79 పరుగులతో రెచ్చిపోయింది. చివరలో రాధా యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి జట్టును ఛాంపియన్ గా నిలిపింది.

బెంగళూరు ప్రైజ్ మనీ ఎంత అంటే ?

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీగానే ప్రైజ్ మనీ రానుంది. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన బెంగళూరుకు ఆరు కోట్లు రానున్నాయి. అలాగే రన్నరప్ ఢిల్లీకి మూడు కోట్లు వస్తాయి. అటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచిన వాళ్లకు ఐదు లక్షలు రానుండగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వాళ్లకు ఐదు లక్షలు రానున్నాయి. బ్యాటింగ్ విభాగంలో ఆరెంజ్ క్యాప్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. అలాగే పర్పుల్ క్యాప్ విజేతకు ఐదు లక్షలు అందించనున్నారు.

 

Related News

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×