PMEGP Scheme Apply: నిరుద్యోగ యువత, మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ ప్రారంభించింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(PMEGP) కింద తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించి, వాటిని విస్తరించేందుకు నిరుద్యోగ యువతకు శిక్షణ, సబ్సిడీతో రుణాలు అందిస్తుంది. ఈ రుణాలపై 15-35% వరకు సబ్సిడీ ఇస్తుంది.
పీఎంఈజీపీ స్కీమ్ ద్వారా రూ.1 లక్ష నుండి రూ.50 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ లోన్ పై 15 నుంచి 35 శాతం వరకు రాయితీ ఉంటుంది. మీ వ్యాపారానికి రూ.20 లక్షల లోన్ తీసుకుంటే అందులో రూ.7 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు రూ.50 లక్షల వరకు లోన్ పొందవచ్చు. సేవా రంగానికి చెందిన వ్యాపార యూనిట్లకు రూ.20 లక్షల వరకు లోన్ లభిస్తుంది.
ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు లోన్ కు అప్లై చేసుకుంటే.. ముందుగా 5 శాతం పెట్టుబడి పెట్టాలి. జనరల్ కేటగిరికి చెందిన వారైతే 10 శాతం వరకు పెట్టుబడి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వ్యాపారానికి 35 శాతం వరకు రాయితీ లభిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కొత్త వ్యాపార యూనిట్లకు లోన్ పై 25 శాతం వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది.
పీఎంఈజీపీ స్కీమ్ కు అప్లై చేసుకునే వారు www.kviconline.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ లో పూర్తి వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో అధికారులు సంప్రదిస్తారు. మీ ప్రాజెక్టుపై నెల రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత లోన్ మంజూరు చేస్తారు. రుణం పొందిన తర్వాత మూడేళ్లు క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లిస్తేనే సబ్సిడీ వస్తుంది. ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులు. కనీసం 8వ తరగతి వరకు విద్యార్హతతో 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే పీఎంఈజీపీ పథకానికి అర్హులు అవుతారు.
Also Read: ముద్ర లోన్ పేరుతో మోసాలకు తెరలేపిన గ్యాంగ్.. అరెస్ట్ చేసిన పోలీసులు