MSME Loans: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిశ్రమలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. మంచి ట్రాక్ రికార్డ్, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న పరిశ్రమలకు రూ.25 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందించవచ్చని నిర్ణయించింది. MSME రుణాలకు సంబంధించిన ఆదేశాలను సవరించింది. ప్రస్తుతం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. తాజాగా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
“బ్యాంకులు, ఎంఎస్ఈ యూనిట్ల మంచి ట్రాక్ రికార్డ్, ఆర్థిక స్థితి ఆధారంగా రూ.25 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు అందిచవచ్చు” అని ఆర్బీఐ తెలిపింది.
అలాగే, అవసరమయ్యే చోట బ్యాంకులు క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చని తెలిపింది. అయితే బ్యాంకులు మంజూరు చేసిన పూచీకత్తు రహిత రుణాలకు బంగారం, వెండిని పూచీకత్తుగా పెట్టుకోవడం ఆర్బీఐ ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా భావించవచ్చని పేర్కొంది.
పరిమిత ఆస్తులు కలిగిన సూక్ష్మ, చిన్న సంస్థలకు పూచీకత్తు లేకుండా క్రెడిట్ అందించడమే తమ లక్ష్యమని ఆర్బీఐ పేర్కొంది. తాజా ఆదేశాలు ఏప్రిల్ 01, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.
బెంచ్ మార్క్ కింద ఎంఎస్ఎంఈలకు రుణాల పరిమితులను, సడలింపులను రీసెట్ నిబంధనలను మూడు నెలలకు తగ్గించారు. దేశీయ ఉత్పత్తి రంగానికి కలగకుండా ప్రభుత్వం ఎస్ఎంఎంఈలకు మినహాయింపులు, సడలింపులు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. సూక్ష్మ సంస్థలకు ఆరు నెలలు, చిన్న సంస్థలకు మూడు నెలల పాటు పలు రకాల సడలింపులు పొడిగించనున్నారు.
Also Read: ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం.. ఎంపీసీ మీటింగ్ లో కీలక అంశాలివే