E-Paper
Advertisement

MSME Loans: ఎంఎస్ఎంఈలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. పూచీకత్తు లేకుండా రూ.25 లక్షల రుణాలు

MSME Loans: ఎంఎస్ఎంఈలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. పూచీకత్తు లేకుండా రూ.25 లక్షల రుణాలు
Advertisement

MSME Loans: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిశ్రమలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. మంచి ట్రాక్ రికార్డ్, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న పరిశ్రమలకు రూ.25 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందించవచ్చని నిర్ణయించింది. MSME రుణాలకు సంబంధించిన ఆదేశాలను సవరించింది. ప్రస్తుతం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. తాజాగా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

“బ్యాంకులు, ఎంఎస్ఈ యూనిట్ల మంచి ట్రాక్ రికార్డ్, ఆర్థిక స్థితి ఆధారంగా రూ.25 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు అందిచవచ్చు” అని ఆర్బీఐ తెలిపింది.
అలాగే, అవసరమయ్యే చోట బ్యాంకులు క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చని తెలిపింది. అయితే బ్యాంకులు మంజూరు చేసిన పూచీకత్తు రహిత రుణాలకు బంగారం, వెండిని పూచీకత్తుగా పెట్టుకోవడం ఆర్బీఐ ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా భావించవచ్చని పేర్కొంది.

Advertisement

పరిమిత ఆస్తులు కలిగిన సూక్ష్మ, చిన్న సంస్థలకు పూచీకత్తు లేకుండా క్రెడిట్ అందించడమే తమ లక్ష్యమని ఆర్బీఐ పేర్కొంది. తాజా ఆదేశాలు ఏప్రిల్ 01, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.

ఎంఎస్ఎంఈలకు సడలింపులు

బెంచ్‌ మార్క్ కింద ఎంఎస్ఎంఈలకు రుణాల పరిమితులను, సడలింపులను రీసెట్ నిబంధనలను మూడు నెలలకు తగ్గించారు. దేశీయ ఉత్పత్తి రంగానికి కలగకుండా ప్రభుత్వం ఎస్ఎంఎంఈలకు మినహాయింపులు, సడలింపులు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. సూక్ష్మ సంస్థలకు ఆరు నెలలు, చిన్న సంస్థలకు మూడు నెలల పాటు పలు రకాల సడలింపులు పొడిగించనున్నారు.

Advertisement

Also Read: ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం.. ఎంపీసీ మీటింగ్ లో కీలక అంశాలివే

Related News

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

నెలకు రూ.15,000 జీతం వచ్చే వారు కూడా లక్షాధికారి ఎలా అవ్వచ్చు? 50-30-20 రూల్ అంటే ఏంటి?

Big Stories

Advertisement
×