E-Paper
Advertisement

Personal Loan: పర్సనల్ లోన్ ఉండగానే వ్యక్తి మరణిస్తే.. ఆ అప్పు ఎవరు కట్టాలి ? చట్టం ఏం చెబుతోంది ?

Personal Loan: పర్సనల్ లోన్ ఉండగానే వ్యక్తి మరణిస్తే.. ఆ అప్పు ఎవరు కట్టాలి ? చట్టం ఏం చెబుతోంది ?

Personal Loan: పర్సనల్ లోన్ అనేది ఎలాంటి తనఖా లేదా ఆస్తి గ్యారెంటీ లేకుండా ఇచ్చే ‘అన్-సెక్యూర్డ్ లోన్’. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి దానిని పూర్తిగా తీర్చక ముందే మరణిస్తే.. ఆ బకాయిల పరిస్థితి ఏంటనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇండియన్ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. కుటుంబ సభ్యుల బాధ్యత ఉండదు:

సాధారణంగా హోం లోన్స్ లేదా వెహికిల్ లోన్స్ విషయంలో ఆస్తి లేదా వాహనం తాకట్టులో ఉంటుంది కాబట్టి, వారసులు ఆ అప్పు కట్టాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంకులు ఆ ఆస్తిని వేలం వేస్తాయి. కానీ పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకులు మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను (భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులను) అప్పు కట్టమని చట్ట పరంగా ఒత్తిడి చేయలేవు. ఎందుకంటే వారు ఆ లోన్ ఒప్పందంపై సంతకం చేయలేదు.

2. గ్యారంటర్:

ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఎవరైనా కో-అప్లికెంట్‌గా ఉన్నా లేదా గ్యారంటర్ (హామీదారు) సంతకం చేసినా.. అసలు వ్యక్తి మరణించిన తర్వాత ఆ అప్పు తీర్చే పూర్తి బాధ్యత వారిపైనే ఉంటుంది. బ్యాంకులు నేరుగా వారిని సంప్రదించి బకాయిలు వసూలు చేస్తాయి.

3. లోన్ ఇన్సూరెన్స్ :

ప్రస్తుతం చాలా బ్యాంకులు పర్సనల్ లోన్ ఇచ్చేటప్పుడే దానికి బీమా చేయిస్తున్నాయి. ఒకవేళ లోన్ తీసుకున్న వారు మరణిస్తే, బీమా కంపెనీ మిగిలిన బకాయి మొత్తాన్ని బ్యాంకుకు చెల్లిస్తుంది. దీని వల్ల కుటుంబ సభ్యులపై ఎలాంటి భారం పడదు. లోన్ తీసుకున్నప్పుడు ‘క్రెడిట్ షీల్డ్’ లేదా ‘లోన్ సురక్ష’ వంటి పాలసీలు ఉన్నాయో లేదో కుటుంబ సభ్యులు చెక్ చేయాలి.

4. మరణించిన వ్యక్తి ఆస్తుల నుంచి రికవరీ:

బ్యాంకుకు చట్టపరంగా ఒక హక్కు ఉంటుంది. మరణించిన వ్యక్తి పేరిట ఏదైనా ఆస్తి (బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా స్థిరాస్తి) ఉంటే.. ఆ ఆస్తి వారసులకు బదిలీ అయ్యేలోపు, దాని నుంచి తమ బకాయిలను రికవరీ చేసుకునే అవకాశం బ్యాంకులకు ఉంటుంది. అయితే.. వారసులు తమ సొంత సంపాదన నుంచి కట్టాల్సిన అవసరం లేదు, కేవలం మృతుఆస్తి నుంచి మాత్రమే బ్యాంకులు వసూలు చేయగలవు.

Also Read: రికార్డుల వేటలో పసిడి.. ఒక్కరోజే భారీ జంప్.. నేడు తులం బంగారం ఎంతంటే?

5. రైట్-ఆఫ్ :

ఒకవేళ మరణించిన వ్యక్తికి ఎలాంటి ఆస్తులు లేవు. ఇన్సూరెన్స్ లేదు , కో-అప్లికెంట్ కూడా లేరని నిర్ధారణ అయితే.. బ్యాంకులు ఆ లోన్‌ను ‘బ్యాడ్ డెట్’ గా పరిగణించి రద్దు చేస్తాయి. అంటే ఆ నష్టాన్ని బ్యాంకు భరిస్తుంది.

కుటుంబ సభ్యులు చేయాల్సిన పనులు:

బ్యాంకుకు సమాచారం ఇవ్వడం: వ్యక్తి మరణించిన వెంటనే డెత్ సర్టిఫికెట్‌తో బ్యాంకుకు సమాచారం అందించాలి.

పాలసీలు: లోన్‌కు బీమా ఉందో లేదో అడిగి తెలుసుకోవాలి.

చట్టపరమైన సలహా: బ్యాంకులు వేధిస్తుంటే చట్టపరమైన నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×