Drones Hit Kuwait Oil Refinery: అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ బెంబేలెత్తిపోతోంది. ఇరాన్ టాప్ నేతలు మృత్యువాతపడడంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో పొరుగుదేశాలపై మిస్సైళ్లు, డ్రోన్ల దాడులతో విరుచుకుపడుతోంది. ఖతార్, కువైట్, ఉత్తర ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు తీవ్రతరం చేసింది ఇరాన్.
కువైట్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ల దాడులు
ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో కొన్ని దేశాల చమురు, గ్యాస్ క్షేత్రాలు, మౌలిక సదుపాయాలపై క్షిపణి, డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. ఒకప్పుడు ఇరాన్-అమెరికా మధ్య జరిగిన ఈ సంఘర్షణ పొరుగు దేశాలకు కూడా విస్తరించింది. మధ్యప్రాచ్యంలో అతి పెద్దది, పురాతన చమురు శుద్ధి కార్మాగారం మీనా అల్-అహ్మది. కువైట్ సిటీకి దక్షిణంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇది కువైట్లో ఉంది. అక్కడ రోజుకు 730,000 బ్యారెళ్ల ఉత్పత్తి చేస్తుంది. దీనిపై ఇరాన్ డ్రోన్ల దాడి జరిగింది. మరొకటి దాడి సమీపంలో మీనా అబ్దుల్లా శుద్ధి కర్మాగారం చేసింది. అందులో రోజుకు 454,000 బ్యారెళ్ల ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఆ దేశ ఎగుమతిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాంతంలో ఇంధన సౌకర్యాలకు ముప్పు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రెండో దాడి జరిగింది.
ఉత్తర ఇరాక్లో అమెరికా స్థావరాలపై కూడా దాడులు
ఈ దాడిలో రిఫైనరీ మంటల్లో చిక్కుకుంది. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. కాకపోతే భారీగా నష్టం జరిగినట్టు కువైట్ జాతీయ పెట్రోలియం సంస్థ అధికారులు చెబుతున్నారు. మంటలు అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించి వీడియో బయటకు వచ్చింది.
వైమానిక దాడులను ఎదుర్కొన్నట్లు కువైట్ సైన్యం తెలిపింది. దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకునే సమయంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను ప్రజలు పాటించాలని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆ దేశంలోని అప్స్ట్రీమ్ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన మొట్ట మొదటి దాడిగా చెబుతున్నారు.
ALSO READ: భారత్కు గ్యాస్ కష్టాలు రెట్టింపు..జలసంధిలో 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ
బుధవారం రాత్రి ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయు క్షేత్రాల్లో ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలలోని ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల ప్రభావం ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లు కుదిపేస్తోంది. దీంతో క్రూడాయిల్ ధర బ్యారెల్కు అమాంతంగా 110 డాలర్లకు పైగానే చేరింది.
🚨🇰🇼🇮🇷 BREAKING:
Kuwait just got hit by two drone attacks on oil refineries.
First, a drone struck the Mina al-Ahmadi refinery, one of the biggest in the Middle East with a production capacity of 730,000 barrels per day.
Then a second attack set the nearby Mina Abdullah… https://t.co/dFZOa9irl2 pic.twitter.com/o7gO8nMltP
— Mario Nawfal (@MarioNawfal) March 19, 2026