E-Paper
Advertisement

Drones Hit Kuwait Oil Refinery: కువైట్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడులు.. ఉత్తర ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై..

Drones Hit Kuwait Oil Refinery: కువైట్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడులు.. ఉత్తర ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై..

Drones Hit Kuwait Oil Refinery: అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ బెంబేలెత్తిపోతోంది. ఇరాన్ టాప్ నేతలు మృత్యువాతపడడంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో పొరుగుదేశాలపై మిస్సైళ్లు, డ్రోన్ల దాడులతో విరుచుకుపడుతోంది. ఖతార్, కువైట్, ఉత్తర ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు తీవ్రతరం చేసింది ఇరాన్.

కువైట్ ఆయిల్ రిఫైనరీపై  ఇరాన్ డ్రోన్ల దాడులు

ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో కొన్ని దేశాల చమురు, గ్యాస్ క్షేత్రాలు, మౌలిక సదుపాయాలపై క్షిపణి, డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. ఒకప్పుడు ఇరాన్-అమెరికా మధ్య జరిగిన ఈ సంఘర్షణ పొరుగు దేశాలకు కూడా విస్తరించింది. మధ్యప్రాచ్యంలో అతి పెద్దది, పురాతన చమురు శుద్ధి కార్మాగారం మీనా అల్-అహ్మది. కువైట్ సిటీకి దక్షిణంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇది కువైట్‌లో ఉంది. అక్కడ రోజుకు 730,000 బ్యారెళ్ల ఉత్పత్తి చేస్తుంది. దీనిపై ఇరాన్ డ్రోన్ల దాడి జరిగింది. మరొకటి దాడి సమీపంలో మీనా అబ్దుల్లా శుద్ధి కర్మాగారం చేసింది. అందులో రోజుకు 454,000 బ్యారెళ్ల ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఆ దేశ ఎగుమతిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాంతంలో ఇంధన సౌకర్యాలకు ముప్పు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రెండో దాడి జరిగింది.

ఉత్తర ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై కూడా దాడులు

ఈ దాడిలో రిఫైనరీ మంటల్లో చిక్కుకుంది. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. కాకపోతే భారీగా నష్టం జరిగినట్టు కువైట్ జాతీయ పెట్రోలియం సంస్థ అధికారులు చెబుతున్నారు. మంటలు అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించి వీడియో బయటకు వచ్చింది.

వైమానిక దాడులను ఎదుర్కొన్నట్లు కువైట్ సైన్యం తెలిపింది. దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకునే సమయంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను ప్రజలు పాటించాలని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆ దేశంలోని అప్‌స్ట్రీమ్ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన మొట్ట మొదటి దాడిగా చెబుతున్నారు.

ALSO READ: భారత్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు..జలసంధిలో 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ

బుధవారం రాత్రి ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయు క్షేత్రాల్లో ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలలోని ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల ప్రభావం ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లు కుదిపేస్తోంది. దీంతో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు అమాంతంగా 110 డాలర్లకు పైగానే చేరింది.

 

 

 

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×