India’s Gas Woes: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయా? కీలక నేతలను కోల్పోయిన బాధలో ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపిస్తోందా? పొరుగుదేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఎక్కుపెట్టిందా? ఇంతకీ హర్మూజ్ జలసంధి భారత్కు చెందిన గ్యాస్ నౌకలు ఎన్ని ఉన్నాయి? గ్యాస్, ఆయిల్ నిల్వల డేటా ఇవ్వాలని కంపెనీలను కేంద్రం ఎందుకు ఆదేశించింది?
ఇరాన్తో తీవ్రమవుతున్న పరిస్థితులు.. హర్మూజ్ జలసంధిలో 22 భారత్ నౌకలు
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా దీని ప్రభావం యూరప్తోపాటు ఆసియా దేశాలపై పడుతోంది. భారత్కు రావాల్సిన దాదాపు 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ జలసంధిలో నిలిచి పోయింది.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా దీని ప్రభావం యూరప్తోపాటు ఆసియా దేశాలపై పడుతోంది. భారత్కు రావాల్సిన దాదాపు 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ జలసంధిలో నిలిచి పోయింది. గల్ప్ నుంచి భారత్కు రావాల్సిన 22 భారత్ నౌకలు అక్కడ చిక్కుకున్నాయి. అందులో భారత్కు ఎల్పీజీని తీసుకొస్తున్న నౌకలు ఉన్నాయి.
డేటా ఇవ్వాలని చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశం
యుద్ధం నేపథ్యంలో భద్రతా పరమైన అనుమతులు లభించలేదు. దీంతో అక్కడ ఆయా నౌకలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. అయితే బుధవారం రాత్రి ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లోని గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ మెరుపు దాడులు చేసింది. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. యుద్ధం మొదలై ఇప్పటికి 20 రోజులకు చేరుకున్నా, ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
దీని ప్రభావం వల్ల హర్మూజ్ జలసంధిలో భారత్కి చెందిన 22 నౌకలు ఉండిపోయాయి. 6 ఎల్పిజి నౌకలు, ఎల్ఎన్జి ట్యాంకర్ ఒకటి, 4 ముడి చమురు నౌకలు, రసాయనాలు-ఉత్పత్తులకు చెందిన ఒకటి, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్లు జలసంధిలో చిక్కుకున్నాయి. జలసంధిలో ఇదే పరిస్థితి కొనసాగితే దేశీయంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ: భగ్గుమన్న ట్రంప్.. ఖతార్ జోలికి మళ్లీ వస్తే ఇరాన్లో గ్యాస్ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తాం
దీనిపై కేంద్ర పెట్రోలియం, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖలు దృష్టి సారించాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఇరాన్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో చమురుకు అంతరాయం ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా దేశంలో చమురు, గ్యాస్ కంపెనీలకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆయా సంస్థల వద్దనున్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని సరఫరా గొలుసును పర్యవేక్షించేందుకు ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటుచేసే ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కంపెనీలు వాటికి సంబంధించి వివరాలను పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్కు ఇవ్వనున్నాయి.